ఇటీవల కాలంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు తాను మాత్రమే ప్రవేశ పెట్టేసి… చేసేస్తున్నట్లు చెబుతున్నారంటూ కొందరు రాజకీయ ప్రముఖులు ప్రత్యక్షంగానే విమర్శిస్తూన్నప్పటికీ… అబ్బే మా తీరు ఇంతే అని అధికార పార్టీ ప్రవర్తిస్తుంది.
గత కొంతకాలంగా ముఖ్యమంత్రి, మంత్రులు మేము అన్ని కులాల వారికి సమ న్యాయం చేస్తున్నమంటూ తెగ గొప్పలు చెప్పేసుకుంటున్నారు కూడా..
సారు.. మీరెవరికి ఇచ్చారో…
కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి రాష్ట్రంలోని బీసీల కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేశామని మీడియాకు తెలిపారు. దీనిపై స్పందించిన కొందరు ప్రతిపక్ష పార్టీ నాయకులు ‘జగన్ సర్కారు ఎవరికి, ఎప్పుడు, ఏ పథకం కింద సాయం చేశారో’ చెప్పాలన్నారు. కేవలం 16 నెలల పరిపాలన కాలంలో రూ.33 వేల కోట్లు ఖర్చు చేశారంటే మీరు సామాన్యులు కాదు సారు. అసలు రాష్ర్టంలో ఉన్న బీసీలే సుమారు 2.50 కోట్ల మంది వారి కోసమే మీరు రూ.33 వేల కోట్లు ఖర్చు చేశాసారా? అంటూ కొందరు రాజకీయ ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు.
అప్పుడు 139 కదా రెడ్డి గారు… మరిప్పుడు 56 ఏంటి..?
ఎన్నికల ముందు 139 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు కదా జగన్ సార్. మరి ఇప్పుడు ఏంటి కేవలం 56 కులాలకు మాత్రమే కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
వీటి గురించి ప్రశ్నిస్తున్నారనేగా వారి అరెస్ట్ లు..?
బీసీలకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారనేగా ప్రతిపక్ష బీసీ నాయకుల మీద క్రిమినల్ కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారంటూ కొందరు ప్రత్యక్షంగానే అధికార పార్టీని నిలదీస్తున్నారు.
దూకుడు తగ్గుతుందనుకున్నారా…?
ప్రతిపక్ష పార్టీ నాయకులపై క్రిమినల్ కేసులు పెట్టి…జైలుకు పంపించినంత మాత్రాన… మీరు చేసే అన్యాయాల గురించి మాట్లాడరు అనుకున్నారా..? అలాంటిది ఏమి లేదండి. ప్రభుత్వ తీరులో లోపాలుంటే ఎత్తి చూపకుండా తగ్గేది లేదని నిరూపిస్తున్నారు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర.











