ఏపీలో గత నాలుగునరేళ్ళుగా అభివృద్ధి విధ్వంసక ‘జేసీబీ’ పాలన సాగుతోంది. కూల్చడం తప్ప కట్టడం తెలియని అర్భకుడి ఏలుబడిలో రాష్ట్రం అల్లాడిపోతోంది.
అన్నపూర్ణగా విరాజిల్లిన ఆంధ్రప్రదేశ్ లో నిరు పేదవాడి ఆకలి తీర్చేందుకు ఆనాడు ఏపీ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్న క్యాంటీన్లు తీసుకొచ్చాడు. దాదాపు రాష్ట్రంలో 110 మున్సిపాలిటీలో 203 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి.. పెద్దఎత్తున పేదవాడికి అల్పహారం.., అన్నప్రసాదాల వితరణ చేసింది టీడీపీ ప్రభుత్వం. ఎటువంటి అవినీతికి తావువ్వకుండా కాంటీన్ల పూర్తి నిర్వాహణ బాధ్యతలను అక్షయపాత్ర ఫౌండేషన్ కు అప్పగించింది. కేవలం ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం, అల్పహారాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చారు చంద్రబాబు. అల్ఫాహారంలో మూడి ఇడ్లీలు,మూడు పూరీలు, ఉప్మా, పొంగల్ ఉండేలా చూసేవాళ్ళు. భోజనంలో అన్నం,పప్పు, సాంబార్, ఊరగాయ, కూర, పెరుగుతో లంచ్,డిన్నర్ ను తిన్నంత అందించే వాళ్ళు.
ఆనాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం తీసుకొచ్చి ఆదుకుంటే.. నేడు చంద్రబాబు ఐదు రూపాయలకే అన్నం పెడుతున్నారని అన్నీవర్గాల ప్రజలు ప్రశంసించారు. ఈ అన్న క్యాంటీన్లు ఏర్పాటు ద్వారా ప్రతిరోజు దాదాపు పది లక్షల మందికి పైగా ఆకలి, దప్పికలు తీర్చుకున్నారని నివేదికలున్నాయి. పేదల ఆకలిని తీర్చేందుకు అన్నదాన పథకాన్ని తమిళనాడులోని దివంగ ముఖ్యమంత్రి జయ లలిత అమ్మ క్యాంటీన్లను మొట్టమొదటిసారి ప్రవేశపెట్టగా.. దక్షిణాది రాష్ట్రాలలో రెండో రాష్ట్రంగా ఏపీలో అన్న క్యాంటీన్లు నిలచాయి.
కానీ.., జగన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన తొలిరోజే ఈ అన్నక్యాంటీన్లపై దాడి జరిగింది. క్యాంటీన్లు మూసివేయాలని హుకుం జారీ చేశారు. ఆకలి తీర్చే ఆలయాలుగా ఆనాడు విరాజిల్లిన అన్న క్యాంటీన్లు.. నేడు బూతు బంగాళాలుగా మాదిరిగా మారాయి. నిరూపుమానంగా తయారై.. అసాంఘీక కార్యకలపాలను కేంద్రబిందువులుగా పడి ఉన్నాయి. తమిళనాడు జయలలిత ప్రవేశపెట్టిన అమ్మ క్యాంటీన్లను.. ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రి స్టాలీన్ వాటిని రోల్ మోడల్ గా తీసుకుని అదే పేరుతో వాటిని నేటికీ కంటిన్యూ చేస్తున్నారు. కానీ మనోదౌర్బల్యం నిండిన జగన్.. పేదవాడి పతనానికి అన్న అన్న క్యాంటీన్లను మూసివేయించారు.
ఇదిలా ఉంటే నాలుగునరేళ్ళ తరువాత అన్న క్యాంటీన్ల స్థానంలో కలరింగ్ ఇస్తూ ఆహా క్యాంటిన్లు తెరపైకి తీసుకొచ్చారు. అరకోర భోజనానికి రూ. 30 వసూలు చేస్తూ.. పేదవాడిని నిలువదోపిడికి యత్నించింది వైసీపీ ప్రభుత్వం. అది కూడా మూన్నాళ్ళ ముచ్చటగా నడిపి.. చివరికి మూసి వేశారు. లక్షలాదిమంది ఆకలి తీర్చిలే చంద్రబాబు అన్న క్యాంటిన్ లను తీసుకొచ్చి.. పేదవాడి కడుపునింపితే.. అదే పేదవాడి కడుపు కొట్టేలా నేడు జగన్ రెడ్డి వ్యవహారశైలి ఉండటంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.











