హారర్ సినిమాలు తీయడంలో వర్మది ప్రత్యేకమైన స్టైల్. ‘రాత్రి, దెయ్యం, మర్రిచెట్టు, డర్నా మనాహై, మధ్యాహ్నం హత్య, ఐస్ క్రీమ్’ లాంటి ఎన్నో హారర్ మూవీస్ తీసి .. సత్తా చాటుకున్న ఆయన చాలా ఏళ్ళ క్రితం యాంగ్రీ మేన్ రాజశేఖర్ హీరోగా ‘పట్టపగలు’ అనే హారర్ మూవీ తీశాడు. అయితే ఆ సినిమా అప్పట్లో ఆర్దిక కారణాల వల్ల విడుదల కాలేకపోయింది. దానికి తోడు రాజశేఖర్ తో వర్మకి అభిప్రాయ బేధాలు రావడం కూడా ఓ కారణం అయింది. అలాంటి ఆ సినిమాని ‘దెయ్యం’గా పేరు మార్చి ఈ నెల 16న విముక్తి కలిగించబోతున్నాడు వర్మ. ఈ నేపథ్యంలో దెయ్యం మూవీ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.
ప్రస్తుతం రాజశేఖర్ .. మూడు ప్రాజెక్ట్స్ ను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. అంతకు ముందు గరుడ వేగతో ఆయన మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టే కనిపించినా.. ప్రశాంత్ వర్మ కల్కి సినిమా సరిగా ఆడకపోవడంతో.. ఆయన తదుపరి ప్రాజెక్ట్స్ చాలా లేట్ గా పట్టాలెక్కుతున్నాయి. శేఖర్, మర్మాణువు లాంటి సినిమాలతో పాటు మరో థ్రిల్లర్ మూవీ కూడా లైన్ లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజశేఖర్ ఫామ్ లో లేని కాలంలో తీసిన హారర్ మూవీతో ఇప్పుడు వర్మ రానుండడం .. రాజశేఖర్ కు ఖచ్చితంగా తలనొప్పి వ్యవహారమే. మరి ఈ నెల 16న రాబోతున్న దెయ్యం.. రాజశేఖర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందో .. లేక ఆయనకి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
Must Read ;- గోవాలో వర్మను కలిసిన బిగ్ బాస్ బ్యూటీ
#RGV #Deyyam Movie Official Trailer HD (2021) | #Rajasekhar, #SwathiDeekshith
WATCH : https://t.co/LnqsAtzVrO@RGVzoomin @ActorRajasekhar @cutedeekshith pic.twitter.com/BwDSL4AhLW
— OverSeasRights.Com (@Overseasrights) April 7, 2021