తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు.
రజనీకాంత్ హైబీపీతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. అన్నాత్తె షూటింగ్ లోని వారికి కరోనా పాజిటివ్ గా తేలిన సమయంలో రజనీకాంత్ కు కూడా కరోనా పరీక్షలు చేయించారు. ఆయనకు నెగటివ్ వచ్చింది. ఆయన ఆ సమయానికి హైదరాబాదులోనే ఉన్నారు. అక్కడి నివాసంలోనే హోమ్ ఐసొలేషన్ లో ఉండిపోయారు.
తాజాగా రజనీకాంత్ హైబీపీతో బాధపడుతూ, తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. దీంతో జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు.
రజనీకాంత్ తాజాగా నటిస్తున్న అన్నాత్తె చిత్రం షూటింగ్ కోసం ఇటీవలే హైదరాబాదు వచ్చారు. ఈ చిత్రాన్ని త్వరగా పూర్తిచేసి ఫిబ్రవరిలోగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీ కూడా కీలకంగా పోటీ పడబోతున్న నేపథ్యంలో.. ఈ సినిమాను ముందే విడుదల చేయడానికి డిసైడయ్యారు. అయితే చిత్ర షూటింగ్ ప్రారంభం అయ్యాక.. యూనిట్ లో ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయనకు కూడా 22వ తేదీన పరీక్షలు చేయిస్తే.. నెగటివ్ వచ్చింది.
అయినప్పటికీ.. హోమ్ ఐసొలేషన్ లోనే ఉండిపోయారు. ఇవాళ హైబీపీతో బాధపడుతుండడంతో ఆస్పత్రికి తరలించారు.
Must Read ;- తలైవా రజనీకాంత్ సినిమాకి కరోనా షాక్ .. !