తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చారు. రామోజీ ఫిలింసిటీలో గత కొన్ని రోజులుగా షూటింగ్ జరుగుతుంది. అయితే.. ఈ మూవీ యూనిట్ మెంబర్స్ లో కొంత మందికి కరోనా వచ్చింది. దీంతో ఆ మూవీ షూటింగ్ ఆపేసారు. రజనీకాంత్ మాత్రం హైదరాబాద్ లోనే ఉన్నారు. ఆయన కరోనా టెస్ట్ చేయించుకుంటే.. నెగిటివ్ వచ్చింది. అయితే.. హైబీపీతో అస్వస్థతకు గురైన రజనీకాంత్, జూబ్లీహిల్స్ అపోలో చేరారు. రజనీకాంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని హాస్పటల్ వర్గాలు తెలియచేసాయి.
రజనీ హాస్పటల్ లో జాయిన్ అయ్యారనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి పలువురు సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. పవర్ స్టార్, జనసేన అధినేత పవన కళ్యాణ్ స్పందిస్తూ.. ప్రముఖ కథానాయకులు శ్రీ రజనీకాంత్ గారు అస్వస్థతతో హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చేరినట్లు తెలిసి బాధపడ్డాను. కరోనా లక్షణాలు లేవని వైద్యులు ప్రకటించడం ఊరటనిచ్చింది. మనోధైర్యం మెండుగా ఉన్న శ్రీ రజనీకాంత్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
ఆధ్యాత్మికపరులైన ఆయనకు భగవదనుగ్రహం కలగాలి. ఆయన ఎంతగానో విశ్వసించే మహావతార్ బాబాజీ ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో మన ముందుకు రావాలని కోరుకొంటున్నాను అని పవన్ కళ్యాణ్ తెలియచేశారు.
Must Read ;- తలైవా రజనీకాంత్కు తీవ్ర అస్వస్థత.. అపోలోలో చేరిక