తలైవా రజనీకాంత్ ప్రస్తుతం నటిస్తోన్న తమిళ సినిమా అన్నాత్త. శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మాస్ యాక్షన్ మూవీ ప్రస్తుతం సెట్స్ మీదుంది. అయితే రజనీ రాజకీయ ప్రవేశం నేపథ్యంలో దర్శకుడు ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా ముగించాలనే ఉద్దేశంతో శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నాడు. అయితే ఎవరూ ఊహించని షాక్ తగిలింది ఈ సినిమా యూనిట్ కు. చిత్ర బృందంలో మొత్తం ఆరుగురికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో .. షూటింగ్ ను అర్ధంతరంగా ఆపేయాల్సి వచ్చింది.
అయితే రజనీకాంత్ కు మాత్రం కరోనా నెగెటివ్ అని తేలడంతో అభిమానులు, దర్శక, నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. రజనీ ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన మేజర్ పార్ట్ పూర్తయినా.. మరికొన్ని ప్రధాన సన్నివేశాలు బ్యాలెన్స్ ఉండడంతో .. చిత్ర యూనిట్ కు ఈ అనుకోని షాక్ తగిలింది. మరి అన్నాత్త సినిమా చిత్రీకరణ ఎప్పుడు పూర్తి అవుతుందో చూడాలి.
Must Read ;- రజనీ చివరి చిత్రం ఎన్నికల లోపు వస్తుందా? రాదా?