స్కిల్ స్కాం అంటూ బనాయించిన అక్రమ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ అయ్యి నెలరోజులు కావస్తోంది. ఆనాటి నుంచి ఏపీలో రాజకీయాల్లో అనుహ్యమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిరోజు ప్రజలు మార్పులు గమనిస్తునే ఉన్నారు. ఎన్డీఏ భాగస్వామ్యం ఉంటూనే బీజేపీ తో పొత్తు పెట్టుకుంటే ఓన్లీ ఓట్లే తప్పా..సీట్లేమీ రావు అన్నది వాదనను పవన్ లేవనేత్తడం నేడు చర్చనీయాంశంగా మారింది. మొన్న విజయవాడ లో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో బీజేపీ సీనియర్లందరూ ముక్తంకఠంతో చంద్రబాబు అరెస్ట్ ను ఖండించినట్లు తెలుస్తోంది. బీజేపీ కేంద్ర పెద్దలకు తెలియకుండానే చంద్రబాబు అరెస్ట్ జరిగిందా..? జగన్ అంత సాహాసం చేస్తారా..? అని ప్రజలు అనుకుంటున్నారని ఆ సమావేశంలో నేతల చర్చలో వచ్చిందంట.
చంద్రబాబు అరెస్ట్ ఇంటా .. బయటా బీజేపీ నేతలను కలవరానికి గురిచేస్తోంది. నేర ప్రవృత్తితో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రితో మనం మిత్రపక్షంగా కొనసాగితే ఏపీలో ఉన్న.. ఆ కాస్త ఓటు బ్యాంకు గల్లంతు కాకతప్పదని అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారంట సీనియర్లు. ఏపికివ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వకపోగా.. విశాఖ ఉక్కును అమ్మెయ్యాలని చూసే బీజేపీకి ఈసారి నియోజవర్గాల్లో నిలబడేందుకు అభ్యర్ధులు కూడా కూడా దొరకడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తం చేశారంట.
మరోవైపు 2019 నుంచి ఏపీకి ఒక్క హామీ కూడా నెరవేర్చలేని బీజేపీ.. మూడు రాజధానులు.., ఉక్కు ప్రైవేటీకరణ.., ప్రత్యేక హోదాను పట్టించుకున్న పాపాన పోలేదు. జగన్ చేస్తున్న అరాచకాలకు మడుగులొత్తుతు పాపంలో భాగస్వాములయ్యారన్నది వాస్తవం. వివేక హత్యకేసులో సెంట్రల్ బీజేపీ అడ్డుపడుతోందని.. లేకుంటే ఆ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యి.. ఎప్పుడో ఆ కేసు తేలేదని వాదనలు లేకపోలేదు. ఇంకా వైపు రాష్ట్ర సంపదను గుజరాత్ గజదొంగకు దోచిపెడుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.
మొత్తంగా బీజేపీ ఏపీ.., తెలంగాణ లో కనుమరుగయ్యే పరిస్ధితి లేకపోలేదు. ఈసారి కేంద్రంలో కూడా కష్టమేనని ఇప్పటికే సర్వేలు రచ్చ చేస్తున్నాయి. వైసీపీ పట్లు కేంద్ర వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని .., ఇది అంత మంచి పరిణామం కాదని ఆ పార్టీని సీనియర్లు హెచ్చరిస్తున్నారు.











