ఏ లీడర్ని అయినా అరెస్ట్ చేస్తే ఆ పార్టీ నేతలు ఏం చేస్తారు..? వెంటనే పోలీసులకి వ్యతిరేకంగా ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి ధర్నా చేస్తారు.. నిరసన వ్యక్తం చేస్తారు.. లేదంటే, ప్రభుత్వ వ్యతిరేక చర్య చేపట్టాలంటే ఏం చేస్తారు..? ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సదరు రాష్ట్రంలో, సదరు ప్రాంతంలో నిరసన, ఆందోళన చేపడతారు.. కానీ, ఆ రాష్ట్రంతో సంబంధంలేని మరో రాష్ట్రంలో ధర్నాలు చేస్తే..? పొరుగు రాష్ట్రంలో వ్యతిరేక చర్యలు చేపడితే..?? దీనిని ఏమనాలి..?? వర్క్ ఫ్రమ్ పొరుగు రాష్ట్రం అనాలా..? లేక, అతి తెలివితేటలు అనాలా..?
సరిగ్గా ఇదే చేస్తోంది వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల.. వైసీపీలో మాజీ మంత్రులు రోజా, విడదల రజినిలాంటి మహిళా నేతలకి చెక్ పెట్టి, యాంకర్ శ్యామలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది వైసీపీ హైకమాండ్.. పవర్లో ఉన్నప్పుడు రోజా, రజినికి అవినీతి మరకలు అంటుకున్నాయి.. దీంతో, ఆ ఇద్దరి వాయిస్ సరిగా రీచ్ అవదు అని వైసీపీ అగ్ర నాయకత్వం భావించినట్లుంది.. శ్యామలని రంగంలోకి దింపిది.. ఇది తెలిసి దానినే క్యాష్ చేసుకోవాలని యాంకర్ శ్యామల లెక్కలు వేసుకున్నట్లు ఉంది. ఇప్పటికే నెలకి ఆమెకి మూడు లక్షల రూపాయల ప్యాకేజ్ ఇస్తున్నారనే ప్రచారం సాగుతోంది.. తన ప్యాకేజ్కి తగిన న్యాయం చేయాలని డిసైడ్ అయిన శ్యామల వ్యూహం మార్చింది.. ఏపీకి వెళ్లకుండా, హైదరాబాద్ నుండే రాజకీయం చేస్తోంది.. తాను నివాసం ఉంటున్న హైదరాబాద్ కూకట్పల్లిలోని తన ఇంటి సమీపంలోనే ఏపీ సర్కార్పై ధర్నాలు, నిరసనలు చేపడుతోంది.. ఈ అంశమే ఇప్పుడు వైసీపీ అగ్రనాయకత్వాన్ని విస్మయ పరుస్తోంది..
ఏపీ సర్కార్ తీసుకున్న మెడికల్ కాలేజ్లపై పీపీపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ, ధర్నాలు, ఆందోళనలు కూకట్పల్లిలో చేస్తోంది శ్యామల.. మాచర్ల మాజీ ఎమ్ఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఆయన తమ్ముడిని జంట హ*త్యల కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు.. దీనిపై నిరసనకి వేదికని కూడా కూకట్పల్లిని ఎంచుకుంది శ్యామల.. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే ఆ ఇద్దరూ లొంగిపోయారు. రిమాండ్కి వెళ్లారు. ఇది కూడా తెలియని శ్యామల డ్రామా చేశారు.. ఆమెకి తోడు వైసీపీ నేత కారుమూరి వెంకట్ రెడ్డి సైతం ధర్నాలో పాల్గొన్నారు.. అయినా, ఈ ఇద్దరు నేతలు ఏపీ రాజకీయాలని కూకట్పల్లి నుండి నడుపుతున్నారు. అక్కడికి వెళ్లి రావడానికి ఖర్చులు దండగ అనుకున్నారో, లేక ప్యాకేజ్ అందలేదో కానీ, వర్క్ ఫ్రమ్ కూకట్ పల్లి పాలిటిక్స్ చేస్తున్నారు.. గతంలో హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అరెస్ట్పై శాంతియుత నిరసనలకు పాల్పడితే శాంతి భద్రతలకు భంగం అని రెచ్చిపోయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి శ్యామల, కారుమూరి వెంకట్ రెడ్డి చర్యలు కనిపించడం లేదా..? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి..











