ఏపీ ప్రభుత్వం మహిళా ఖైదీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న 53 మంది ఖైదీల విడుదలకు రంగం సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో యావజ్జీవ శిక్ష ను అనుభవిస్తున్న ఖైదీలకు జైలు జీవితం నుంచి విముక్తి లభించే అవకాశం వచ్చింది. కడప జైలు నుండి 27 మంది, రాజమండ్రి జైలు నుండి 19 మంది, నెల్లూరు నుండి ఐదుగురు, విశాఖ నుండి ఇద్దరు విడుదలకు ఎంపిక అయ్యారు.
కండీషన్స్ అప్లై
మహిళా ఖైదీల విడుదలకు సన్నగ్ధమైన ఏపీ ప్రభుత్వం, అందుకు అవసరమైన నియమాలను విడుదల చేసింది. విడుదయ్యే ఖైదీలు 50 వేల రూపాయిల పూచీకత్తు బాండ్ ను ప్రభుత్వానికి చూపాలని తెలిపింది. దీనితోపాటు, అమలు కావాల్సిన శిక్షా కాలం పూర్తి అయ్యేంత వరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఎటువంటి నేరాలకు పాల్పడకుండా ఉండాలని, అటువంటి సంఘటనలు ఏమాత్రం పునరావృతమైనా, వెంటనే అరెస్టు చేసి జైలుకు తరలిస్తారని తెలియజేసింది.
Must Read ;- సెల్యూట్ విజయనగరం పోలీస్.. పోగొట్టుకున్న డబ్బు బాధితునికి అందజేత











