కొత్త సంవత్సరాన్ని కౌంటర్లు, ఎన్ కౌంటర్లతో మొదలుపెట్టారు టీడీపీ, వైసీపీ నాయకులు అయ్యన్న పాత్రుడు, విజయసాయి రెడ్డి. ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తూ తన ట్విట్టర్ లో చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో.. దానికి తరదైన రీతితో సమాధానమిచ్చారు అయ్యన్న పాత్రుడు.
ఓటుకు నోటు సూత్రధారి పాత్రధారులు పెదబాబు ,చినబాబేనని తేలిపోయింది.
నేరం చెయ్యడమే కాదు, కవర్ అప్ చేసేందుకు ప్రయత్నించారని ఈడీకి మత్తయ్య ఇచ్చిన స్టేట్మెంట్లో రుజువైంది. వేరే రాష్ట్రాల్లో ఎన్నికలను మేనేజ్ చేసేందుకు ఆంధ్రను కొల్లగొట్టారు. ఇంకెంతమందిని మేనేజ్ చేస్తావు బ్రిఫ్డ్ బాబు?— Vijayasai Reddy V (@VSReddy_MP) January 1, 2021
‘ఓటుకు నోటు సూత్రధారి పాత్రధారులు పెదబాబు ,చినబాబేనని తేలిపోయింది. నేరం చెయ్యడమే కాదు, కవర్ అప్ చేసేందుకు ప్రయత్నించారని ఈడీకి మత్తయ్య ఇచ్చిన స్టేట్మెంట్లో రుజువైంది. వేరే రాష్ట్రాల్లో ఎన్నికలను మేనేజ్ చేసేందుకు ఆంధ్రను కొల్లగొట్టారు. ఇంకెంతమందిని మేనేజ్ చేస్తావు బ్రిఫ్డ్ బాబు?’
43 వేల ప్రజల సొమ్మును దోచుకున్న ఏ1, ఏ2 దొంగలని సిబిఐ, ఈడి ఆధారాలతో సహ నిరూపించిందన్నారు. 16 నెలల మాత్రమే జైల్లో ఉన్నారు. ఈ 2021 సంవత్సరంలో 16 ఏళ్ల జైలు శిక్ష పడడం ఖాయమంటూ ఎద్దేవ చేశారు. హవాలా మార్గాలలో డబ్బు సంపాదించిన అవినీతి చక్రవర్తులంటూ జగన్, విజయసాయిల గురించి ఆరోపణలు చేశారు అయ్యన్నపాత్రుడు.











