బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరిట ఉన్న ఖాతాను ఫెసుబుక్ తొలగించింది. ద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ హింసను ప్రేరేపిస్తున్నారని ఆయన ఖాతాను తొలిగించినట్లు ఎఫ్బి ప్రతినిధులు తెలిపారు. కమ్యూనల్ గైడ్ లైన్స్ ను ఆయన అతిక్రమించారని వారు వెల్లడించారు. అందుకే రాజాసింగ్ అకౌంట్ ను తొలగించమని ఎఫ్బి స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన రాజాసింగ్ తన పేరుతో ఉన్న ఖాతాలను నిలిపివేసినందుకు ఫేస్ బుక్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. తన పేరుతో అనేక ఫేస్ బుక్ ఖాతాలు ఉన్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. తనకు కు తెలియకుండా ఫేస్ బుక్ ఖాతాలు తెరవడం అక్రమమైనదని హెచ్చరించిన ఆయన 2018లో తెరిచిన తన అధికారిక ఖాతాను సైతం నిలిపివేశారని తెలిపారు. ఆ ఖాతాను వెంటనే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజాసింగ్ తెలంగాణ బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే. దూకుడుగా ఉండే ఆయన మజ్లీస్ నేతలంటే ఒంటికాలుపై లేస్తారు. అధికార టీఆర్ఎస్ పార్టీ విధానాలపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తుంటారు. హైదరాబాద్, పాతబస్తీ మొత్తం టూ వీలర్ పై తిరిగే ఆయనకు ముప్పుందని పోలీసులు ఇటీవలే భద్రత కల్పించారు. దానిని కూడా తన ఇమేజి బూస్ట్ చేసుకోడానికి రాజాసింగ్ వాడుకున్నారు. తనకు ఎవ్వరి నుండి ముప్పు ఉందొ తెలపాలని రాజా సింగ్ హోం మంత్రి ని కోరిన సంగతి తెలిసిందే. లోకల్ గా ముప్పు ఉందా? లేక ఇతర ప్రాంతం నుండి నాకు ముప్పు ఉందా అన్నది స్పష్టంగా తెలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎవరి ద్వారా ముప్పు ఉందొ చెప్పకుండా ఉండటం ఏంటని హోంమంత్రి ని కూడా విమర్శించిన ఆయన పొలిటికల్ మైలేజిని పొందాడు. మొత్తం మీద రాజాసింగ్ తన ఇమేజ్ బూస్ట్ కోసం ఏ చిన్న అంశాన్ని కూడా వదిలిపెట్టడనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.