అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక, పర్సనల్ అటాక్స్కు దిగుతున్నారు. తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ వైసీపీ తీరుకు నిదర్శనం. మహిళా హోంమంత్రిపై పాలసీల పరంగా విమర్శలు చేయలేక, ఆమె రూపంపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు గుడివాడ అమర్నాథ్. గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా మహిళలను అవమానించిన హిస్టరీ వైసీపీకి ఉంది, ఇప్పుడు అదే పరంపరను అమర్నాథ్ కంటిన్యూ చేస్తున్నారు.
చోడవరం మీటింగ్లో అమర్నాథ్ మాట్లాడుతూ…హోంమంత్రి అనితను మేకప్ మంత్రి అంటూ బాడీ షేమింగ్కు దిగారు. ఎండలో తిరిగితే కిలోల కొద్దీ మేకప్ పడుతుందని, ఆ మేకప్తో గోడలకు పుట్టీ కూడా పెట్టుకోవచ్చంటూ సెటైర్లు వేశారు. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న మహిళపై ఇంత ఘోరమైన లాంగ్వేజ్ వాడటం పట్ల జనం మండిపడుతున్నారు. రాజకీయ విమర్శల పేరుతో మహిళల వ్యక్తిత్వాన్ని కించపరచడమే వైసీపీ మార్క్ సంస్కృతి అని మండిపడుతున్నారు.
దళిత మహిళ కష్టపడి లీడర్గా ఎదిగి హోంమంత్రి అయితే వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో కూడా అనితపై తాడేపల్లి గ్యాంగ్ దారుణమైన ట్రోలింగ్స్ చేసింది. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ లాంటి మాజీ మంత్రి కూడా అదే బాటలో నడవడం వైసీపీ యాంటీ-ఉమెన్ మైండ్సెట్ను చూపిస్తోంది. నిరుద్యోగుల ఉద్యోగాల గురించి అడిగే హక్కు ఉందంటూనే, అసలు మ్యాటర్ను వదిలేసి ఇలాంటి పర్సనల్ ఎటాక్స్ చేయడం దారుణం.
పదవి పోయినా గన్మెన్ల అవసరం లేదంటూ, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ గురించి అమర్నాథ్ మాట్లాడటం చూస్తుంటే పవర్ కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ క్లియర్గా కనిపిస్తోంది. ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడం వల్లే గత ఎన్నికల్లో జనం వైసీపీకి బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకుండా మహిళా లీడర్లను టార్గెట్ చేస్తే మిగిలిన కాస్త ఇమేజ్ కూడా డ్యామేజ్ కావడం ఖాయం.










