బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు…. టీడీపీ అంటే ఏ స్థాయిలో విరుచుకుపడతారో ఊహించలేనిది కాదు.. టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు గుర్తుకు వస్తే.. ఆయన విమర్శలు ఎక్కుపెడతారు.. తన నోటికి పని చెబుతారు.. బీఆర్ఎస్ ఆవిర్భావం నుండి హరీష్ రావుది అదే స్టాండ్.. టీడీపీని ఆగర్భ శత్రువులా భావిస్తారు ఆయన.. అలాంటి కరుడుగట్టిన గులాబీ నేత… తాజాగా టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్ బాటలో పయనించడానికి ఉవ్విళ్లూరుతున్నట్లు ప్రకటించారు.. ఇదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికరంగా మారుతోంది.. ఇటు, వైసీపీ అధినేత జగన్ని టెన్షన్ పెడుతోంది..
ఇంతకీ అసలు విషయం ఏంటంటే…. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు…. పలు కార్యక్రమాలలో పాలు పంచుకున్న ఆయన లోకేష్ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకువచ్చారు.. నిన్నమొన్నటివరకు లోకేష్ రెడ్ బుక్పై తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ నేతలు, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సైతం తాజాగా అదే బాటలో పయనిస్తున్నారు.. ఎర్ర బుక్ ప్రస్తావన చేస్తున్నారు.. తమను ఇబ్బంది పెట్టిన నేతలు, అధికారుల పేర్లు ఎర్ర బుక్ అంటారో, మరే బుక్ అంటారో తెలియదు కానీ, ఆ బుక్లో రాసుకోవాలని కేడర్కి సూచిస్తున్నారు.. లోకేష్ని విమర్శించినా, ఆయనపై విరుచుకుపడినా.. చివరకి ఆయన మార్గంలోనే వెళుతోంది వైసీపీ..
తాజాగా హరీష్ రావు సైతం…. రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చారు.. కాంగ్రెస్లోని కొందరు నేతలతోపాటు, తమని ఇబ్బంది పెడుతున్న అధికారుల కోసం రెడ్ బుక్ ఓపెన్ చేస్తామని, వారి పేర్లని అందులో రాసుకుంటామని హెచ్చరించారు.. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.. నిన్నమొన్నటివరకు టీడీపీని టార్గెట్ చేసిన గులాబీ నేతలు, తాజాగా తమ రాజకీయ ఉనికి డైలమాలో పడడంతో లోకేష్ సూచించిన రెడ్ బుక్ జపం చేస్తున్నారు.. రెడ్ బుక్ అంటే లోకేష్.. లోకేష్ అంటే రెడ్ బుక్ అనేంతగా అది ప్రత్యామ్నాయంగా మారింది.. అలాంటి రెడ్ బుక్ని బీఆర్ఎస్ నేతలు సైతం అనుసరించడానికి రెడీ అయ్యారంటే.. లోకేష్కి తెలిసో, తెలియకో గులాబీ నేతలు ఎలివేషన్లు ఇస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి..
హరీష్ నోటి వెంట రెడ్ బుక్ పేరు వినిపించిందంటే, అది ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని తెలుగు తమ్ముళ్లు జోష్ మీదున్నారు. తమ నాయకుడు లోకేష్.. కొత్త తరం రాజకీయాలకు బ్రాండ్గా మారిపోయారని ప్రశంసలు కురిపిస్తున్నారు.. మొత్తమ్మీద, తెలుగు నేల రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి.. నేడు రెడ్ బుక్ ప్రస్తావన లేకుండా రాజకీయాలు నడవడం లేదు.. అది ఏపీ అయినా, ఇటు తెలంగాణ అయినా ఎర్ర బుక్తో పాలిటిక్స్ చేస్తున్నాయి.. లోకేష్ గ్రాఫ్ని, ఇమేజ్ని పెంచుతున్నాయి..











