టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్ దూకుడు మీదున్నారు.. వైసీపీ నేతలని టార్గెట్ చేస్తున్నారు.. ముఖ్యంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఎటాక్కి దిగుతున్నారు లోకేష్… మహానాడు వేదికగా జగన్ మోహన్ రెడ్డికి సవాల్ విసిరిన లోకేష్.. తాజాగా మరోసారి అదే చాలెంజ్ చేశారు.. దాదాపు 4 రోజులు అవుతున్నా, లోకేష్ సవాల్కి జగన్ మోహన్ రెడ్డి నుండి ఎలాంటి స్పందన లేదు.. మరి, ఈ సారయినా రెస్పాన్స్ ఉంటుందా..?. అనేది రాజకీయ వర్గాలలో ఆసక్తికర అంశంగా మారుతోంది..
విశాఖలో ఉర్సా కంపెనీకి భూముల కట్టబెట్టడంలో అవినీతి జరిగిందని జగన్ ఆరోపిస్తున్నారు.. కేవలం 99 పైసలకే ఎకరా భూమిని లోకేష్.. తన బినామీ కంపెనీలకు కట్టబెట్టారని ఆరోపించాడు.. దీనిపై మహానాడు వేదికగా లోకేష్ చాలెంజ్ విసిరారు.. 99 పైసలకే కట్టబెట్టినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రకటించారు.. నారా లోకేష్ సవాల్పై జగన్ సైలెంట్గా ఉన్నారు.. దీంతో, తాజాగా అదే చాలెంజ్ని గుర్తు చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు లోకేష్.. ఈ సారి మరింత డోస్ పెంచారు..
Challenge No. 1 అని స్టార్ట్ చేసి…
`@ysjagan గారికి ఓపెన్ ఛాలెంజ్.. మీరు చేసిన ఆరోపణలు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. మీరు చేసిన ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పండి చాలు. ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్ రెడ్డి గారికి కొత్తేమీ కాదు. ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారు అంటూ మీరు తీవ్ర ఆరోపణ చేశారు. నేను స్పష్టంగా మరోసారి చెబుతున్నా.. ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటి పార్క్ హిల్ – 3 లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించాం. కాపులుప్పాడలో ఎకరం యాభై లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించాం. బురదజల్లి ప్యాలస్ లో దాక్కోవడం కాదు.. చేసిన ఆరోపణలు నిరూపించండి. ఛాలెంజ్ కు సిద్ధమా జగన్ రెడ్డి గారు? మీ ఐదేళ్ల విధ్వంస పాలనలో ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబడుతున్నాం. కంపెనీలు రావడం, యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు. ఈనో వాడండి కాస్త రిలీఫ్ వస్తుంది.`
లోకేష్ చాలెంజ్పై వైసీపీలో కన్ఫ్యూజన్ మొదలయింది.. ఈ సవాల్పై స్పందించాలో, సైలెంట్గా ఉండాలో ఆ పార్టీకి అర్ధం కావడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.. ఉర్సా వివాదంపై జగన్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.. ఉర్సాకి లోకేష్ చెప్పిన ధరలకే భూములు ఇచ్చారు.. దానిని ప్రూవ్ చేయలేరు.. రియాక్ట్ అయితే, ప్రభుత్వం సాక్ష్యాలతో సహా నిరూపిస్తుంది.. జగన్ అడ్డంగా బుక్ అవుతాడు.. సో.. దీనిపై కిమ్మనలేదు.. ఒక్క ముక్క మాట్లాడలేదు.. అలా అని ప్రతి సవాల్ విసరలేదు.. విసిరితే తర్వాత ఇరుక్కుపోవడం మినహా…. మరో దారి లేదు.. ఈ విషయం వైసీపీకి తెలుసు.. దీంతో, జగన్ డిఫెన్స్లో పడిపోయారని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఇక్కడే లోకేష్కి బలం దొరికింది.. లోకేష్ చేతిలో వైసీపీ అధినేత అడ్డంగా బుక్ అయ్యాడు.. జగన్ జుత్తు టీడీపీ యువనేత చేతిలో ఉంది.. మరి, జగన్ ఈ ఎపిసోడ్ నుండి ఎలా బయటపడతాడో చూడాలి..











