టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలు నుండి బెయిల్పై విడుదలయ్యారు. దాదాపు 52 రోజుల తర్వాత బయటకు వచ్చిన చంద్రబాబుకి జన నీరాజనాలు పలికారు టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు.. రాజమండ్రి నుండి అమరావతిలోని ఆయన నివాసానికి సుమారు 180 కిలోమీటర్ల దూరం.. జెట్ స్పీడ్లో ప్రయాణించే ఆయన కాన్వాయ్కి ఇది కేవలం రెండు గంటల సమయం.. అలాంటిది ఏకంగా 14 గంటలపాటు సుదీర్థ ర్యాలీ జరిగింది.. ఆయనకు అడుగడుగునా ప్రజలు స్వాగత కార్యక్రమాలతో స్వాగతం పలికారు.. ఆయనను అక్కున చేర్చుకున్నారు..
గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 180 కిలోమీటర్ల మేర జరిగిన ఈ భారీ ర్యాలీతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యాయి.. బాబుకి బెయిల్ వస్తుందని తెలిసిన వెంటనే పార్టీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులతోపాటు సాధారణ ప్రజలు కూడా వెంటనే రూట్ మ్యాప్ తెలుసుకున్నారు. తమ గ్రామాలలో, తమ పట్టణాలలో వస్తుందని తెలిసి అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా బారులు తీరారు.. సరిగ్గా ప్రజల మూడ్ తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం అని భావించిన జగన్… ఇంటెలిజెన్స్ టీమ్తోపాటు, ఐ ప్యాక్ టీమ్ ని సైతం రెడీ చేశారట..
బాబు అరెస్ట్తో టీడీపీ తన పాలనపై చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు బ్రేక్ పడుతుందని భావించాడు జగన్.. ఆయన విడుదలకు మరింత టైమ్ పడుతుందని అంచనా వేసుకున్నాడట.. అనూహ్యంగా చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ దక్కడంతో షాక్ అయిన జగన్… తాజాగా తన నిఘా టీమ్ని రంగంలోకి దించాడు… ఈ నివేదికలో ఆయన ఊహించని నిజాలు తెలిశాయనే ప్రచారం జరుగుతోంది.. జగన్ సర్కార్ పాలనపై సామాన్య ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారట.. బాబు అరెస్ట్ తర్వాత అప్పటిదాకా ప్రభుత్వంపై ఉన్న సంక్షేమ పథకాల సానుకూలత కూడా ఎగిరిపోయిందని, కక్ష సాధింపు రాజకీయాలకు జగన్ కేరాఫ్గా మారారని, ఏపీ అభివృద్ధి చెందాలంటే జగన్ని గద్దె దించడమే పరిష్కారం అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారట..
ఇదే అంశాలతో కూడిన నివేదికను జగన్కి సమర్పించారట నిఘా అధికారులు.. దీంతో, జగన్ టీమ్ షాక్ అయిందని సమాచారం.. బాబు అరెస్ట్ వేడిలో ప్రజలు ఇలా చర్చించుకోవడం సహజం అని లెక్కలు కట్టుకుంటోందట తాడేపల్లి ప్యాలెస్.. మరి, దీనిని జగన్ సర్కార్ సమర్ధింపుగా భావించాలో, నిజాల్ని నమ్మలేని పరిస్థితి అని ఊహించాలా.??. తెలియడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి..











