వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి గత ఎన్నికలలో తెరవెనక, తెరముందు అనేక మంది సాయం చేశారు.. అదే ఆయనకు కలిసి వచ్చింది.. గత ఎన్నికలలో జగన్కి ఒక్క చాన్స్ ఇవ్వడానికి, ఆయనని అందలం ఎక్కించడానికి ప్రధానంగా తోడ్పడింది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్… ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు, వ్యూహాలతో జగన్ తిరుగులేని విజయం సాధించారు.. తెరముందు జగన్ కనిపించినా, తెరవెనక ప్రశాంత్ కిశోర్.. విజయానికి బాటలు వేశారు. ఇక, వైసీపీ అధినేతకు సాయం అందించిన మరో అదృశ్య శక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. గత ఎన్నికలలో జగన్కి నిధులతోపాటు ఇతర ఆర్ధిక, అంగ సాయం చేశారు కేసీఆర్.. బాబు అపజయానికి తోడ్పడ్డారు బీఆర్ఎస్ అధినేత.. ఈ ఇద్దరితోపాటు కేంద్రం నుండి మోదీ కూడా జగన్కి అడిగిన సాయం చేసి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు..
తాజాగా సీన్ రివర్స్ అవుతోంది.. గత ఎన్నికలలో జగన్ని వెన్నంటి ప్రోత్సహించిన ప్రశాంత్ కిశోర్.. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనా విధానాలను, ఆయన ఆర్ధిక పాలసీలని తప్పు పడుతున్నారు.. కేవలం సంక్షేమ పథకాలతోనే రాష్ట్రం అభివృద్ధి చెందదని, ఆర్ధికంగా దివాళా తీయడం ఖాయమని అభిప్రాయపడ్డారు.. జగన్ తీరుని తీవ్రంగా ఆక్షేపించారు.. ఆదాయ మార్గాలు పెంచకుండా సంక్షేమ పథకాలు అమలు చేసే హక్కు లేదని స్థాయిలో జగన్పై విరుచుకుపడ్డారు. ఇది జగన్ అభివృద్ది నమూనాని వృధాగా అంచనా వేసింది.. పీకే వ్యాఖ్యలతో జగన్ టీమ్ డైలమాలో పడింది.. దీనిని కవర్ చేసుకోలేక వైసీపీ కంగారు పడింది..
పీకేతోనే తలబొప్పి కట్టిన జగన్కి తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.. ఏపీ, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని బేరీజు వేసుకొని ఓటు వేయాలని పిలుపునిచ్చారు.. ఏపీ, తెలంగాణలో బోర్డర్లో ఎంట్రీ ఇస్తే… డబుల్ రోడ్డు వస్తే అది తెలంగాణ, సింగిల్ రోడ్ కనిపిస్తే అది ఏపీ అని జగన్ని ఎద్దేవా చేశారు.. ఇక, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో వెలుగులు విరజిమ్మితే, ఏపీలో చీకట్లు కమ్ముకున్నాయని వైసీపీ పాలనను తూర్పారపట్టారు.. ఇటు, తన గెలుపు కోసం జగన్ ఈ వ్యాఖ్యలు చేసినా, జగన్ పరిపాలనకు ఇవి అద్దం పడుతున్నాయని తేల్చి చెబుతున్నారు విశ్లేషకులు..
ఇటు, బీజేపీ నేతలు సైతం జగన్ పాలనపై ఎటాక్ ప్రారంభించారు.. గత నాలుగన్నరేళ్లుగా వైసీపీ అధినేతకు సాయం చేసిన కమలదళం నేతలు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తమ రూట్ మార్చారు..
మొత్తమ్మీద, జగన్కి కష్టకాలం మొదలయింది.. నాలుగేళ్లుగా చిన్న అభివృద్ది కార్యక్రమాలు లేకుండా ప్రజలకు సంక్షేమం మినహా మరేమీ అవసరం లేదని సాగించిన పాలనతో అక్షింతలు పడుతున్నాయి.. ఇక, ఓట్లు కూడా పడితే.. వైసీపీ జెండా పీకేయడం ఖాయంగా కనిపిస్తోంది.. అయితే, లేటెస్ట్గా తమ అవసరం కోసం జగన్కి శత్రువులుగా కనిపిస్తోన్న ఈ నేతలు, ఏపీ ఎన్నికల నాటికి మరోసారి ఆయనకు సాయం చేస్తారా.? లేదా.. అనేది చూడాలి..











