పవన్ కల్యాణ్, దర్శకుడు సాగర్ కె.చంద్ర కాంబినేషన్లో .సితార ఎంటర్ టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న చిత్రం సోమవారం హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది. మలయాళంలో సూపర్ డూపర్ హిట్టయిన “అయ్యప్పనుమ్ కోషియుమ్” చిత్రానికి ఇది రీమేక్. పృథ్విరాజ్, బిజుమీనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం అక్కడ 50 మిలియన్ల బడ్జెట్ తో రూపొంది, బాక్సాఫీస్ వద్ద 520 మిలియన్ల కలెక్షన్లను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేసేందుకు ఆసక్తిని కనబరిచారు.
మాతృకలో ఉన్న పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో పవన్ కల్యాణ్ నటించనున్నట్లు తెలిసింది..పవన్ ను ప్రేక్షకాభిమానులు ఎలా చూడాలని కోరుకుంటారో అందుకు తగ్గట్టుగా హై ఓల్టేజ్ కదాంశంతో ఈ చిత్రాన్ని మలచనున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు, అలాగే పవన్ ను దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులు, చేర్పులు చేస్తారట. గతంలో “గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, కొమరం పులి” వంటి చిత్రాల్లో పోలీస్ గా తన నట విన్యాసాన్ని ఆయన ప్రదర్శించిన విషయం తెలియంది కాదు. మరోసారి పవన్ ను పోలీస్ పాత్రలో చూడబోవడం అభిమానులకు పండగే. ఇంకో విశేషం ఏమిటంటే..ఈ చిత్రంలో పవన్ తో కలసి నటించబోవడం పట్ల రానా దగ్గుబాటి కూడా చాలా ఎగ్జియిటింగ్ ఉందని సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్టుల్లో పేర్కొన్నారు.
Must Read ;- పవన్ కళ్యాణ్ తో ఎం.ఎస్.రాజు సినిమా నిజమేనా.?