గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె సినిమాలతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నారు దర్శకుడు క్రిష్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా ఒక పీరియాడికాల్ మూవీ తెరకెక్కిస్తున్నారు. దీన్ని ఏ.యం.రత్నం నిర్మిస్తున్నారు. దాంతో పాటు.. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా.. ఓ వెరైటీ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
కాగా ఈ రోజు క్రిష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిర్మాత ఏ యం రత్నం ఆయనకు బర్త్ డే విషెస్ తెలియచేశారు. పవన్ కళ్యాణ్ ఒక బొకేను పంపి క్రిష్ కి విషెస్ తెలియచేయగా.. ఏ.యం.రత్నం కేక్ కట్ చేశారు.