బీజేపీలో ఓ బలమైన నేత. కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడనే పేరు రఘునందన్రావుకుంది. అంతకుమించి బలమైన వాయిస్ ఉన్న నేతగా రఘునందన్ రావుకు జనంలో పేరుంది. రెండు సార్లు ఓటమి పాలైనా తను మాత్రం పోరాటం ఆపలేదు. చివరకు మూడోసారి విజయాన్ని ముద్దాడాడు. టీఆర్ఎస్పై 1118 ఓట్లతో బీజేపీ విజయం సాధించింది. 20-20 మ్యాచ్ తరహాలో ఉత్కంఠగా సాగిన ఓటింగ్లో టీఆర్ఎస్ పార్టీపై స్వల్ప ఆధిక్యంతో మాధవనేని రఘునందన్రావు దుబ్బాక పీఠం కైవసం చేసుకున్నారు.
తెరాస జోరు, కాంగ్రెస్ నుంచి పోటీని ధీటుగా ఎదుర్కొని విజయభేరీ మోగించారు. రఘునందన్ రావు తెరాసతో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి భాజపాలో కీలక నేతగా మారారు. చిన్నతనం నుంచి రాజకీయాలపై అవగాహన ఉన్న ఆయన డిగ్రీ వరకు సిద్దిపేటలో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. విలేకరిగా మొదలైన మాధవనేని రఘునందన్ రావు జీవితం ఎమ్మెల్యే స్థాయి వరకు వెళ్లింది. హైకోర్టు బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లాలో రఘునందన్ రావు జన్మించారు. తండ్రి పేరు భగవంతరావు. సిద్దిపేటలో బీఎస్సీ చేసిన రఘనందన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బీ పూర్తి చేశారు. అనంతరం ఓ ప్రముఖ పత్రికలో విలేకరిగా పని చేశారు. తదనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా చేరారు.
తెరాస ప్రారంభం నుంచి రఘునందన్ రావు పార్టీలో కీలకంగా పని చేశారు. పొలిట్బ్యూరో సభ్యులుగా, మెదక్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. 2013లో గులాబీ పార్టీ నుంచి సస్పెండైన రఘునందన్రావు తరువాత భాజపాలోచేరారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దుబ్బాక శాసనసభ్యుడు రామలింగారెడ్డి మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో విజయం సాధించారు. రామలింగ రెడ్డి మరణాంతరం మరుసటి రోజు నుంచే దుబ్బాకలో రఘునందన్రావు ప్రచారం సాగించి తన గెలుపుకు బాటలను సుగమం చేసుకున్నారు.