యువ శర్వానంద్, క్రేజీ హీరోయిన్ రష్మిక కాంబినేషన్లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ చిత్రానికి సక్సస్ ఫుల్ డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఇందులో సీనియర్ నటీమణులు రాధిక, ఖుష్భూ, ఊర్వశి కీలక పాత్రలు పోషించడం విశేషం. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మార్చి 4వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ ఫంక్షన్ కి సుకుమార్, సాయిపల్లవి, కీర్తి సురేష్ ముఖ్య అథితులుగా వచ్చారు.
ఈ వేదిక పై సుకుమార్ మాట్లాడుతూ.. శ్రీవల్లి రష్మిక గురించి .. మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇక సాయిపల్లవి విషయానికి వచ్చేసరికి అని సుకుమార్ అనగానే ఆడిటోరియంలో అరుపులు.. కేరింతలు. దాంతో సుకుమార్ మాట్లాడకుండా ఉండిపోయాడు. అప్పుడు ఆయన చెవిలో సాయిపల్లవి ఏదో చెప్పింది. దానికి సుకుమార్.. నా చెవిలో సాయిపల్లవి ఏం చెప్పిందో తెలుసా? తన గురించి చెప్పేదేమైనా ఉంటే తనతోనే చెప్పమని అంటోంది.
ఈ ఫ్యాన్స్ ను చూస్తుంటే.. ఆమె లేడీ పవన్ కళ్యాణ్ అనిపిస్తోంది. తన గురించి ఎప్పుడు మాట్లాడదామన్నా కుదరలేదు. ఆమె మంచి ఆర్టిస్ట్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఒక యాడ్ ను రిజక్ట్ చేసే విషయంలో ఆమె అందరికీ గుర్తుండిపోతుంది. పర్సనల్ గా చెబుదామని చెప్పలేకపోయాను. ఆమె అలా చేయడం నాకు చాలా బాగా అనిపించింది. అంత హ్యూమన్ బీయింగ్ తో ఉండటం నిజంగా చాలా కష్టమైన విషయం అంటూ ఫిదా బ్యూటీ సాయిపల్లవిని ఆకాశానికి ఎత్తేశారు సుకుమార్.