ప్రఖ్యాత నటుడిగా, ప్రసిద్ధ రాజకీయ వేత్తగా తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం దక్కించుకున్న ఆ మహానుభావుడికి చరిత్ర తగిన న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కేవలం తెలుగు ప్రజలకే పరిమితం కాదని, ఆయన ఓ గొప్ప జాతీయ వాదని కొనియాడారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితంపై సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేశ్ రచించిన ‘మేవరిక్ మెస్సయ్య’ పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. లౌకిక, ప్రజాస్వామిక విలువలకు నిబద్ధుడైన ఆదర్శ పాలకుడు ఎన్టీఆర్ అని కీర్తించారు.
One lesser-known and not adequately understood aspect of NTR’s personality was his ‘Indianness’. He was a great admirer of the legacy of the values, customs and philosophy of our country. #NTR #MaverickMessiah
— Vice-President of India (@VPIndia) February 18, 2021
‘సినీ, రాజకీయ రంగాల్లో ఆయనో లెజెండ్. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాన్ని బలోపేతం చేయడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ సృష్టించిన రాజకీయ సునామీని తట్టుకుని నిలబడ్డ అతి తక్కవ మందిలో నేను ఒకడిని’ అని వెంకయ్య పేర్కొన్నారు.
From my multiple interactions with NTR, I could gauge that he was earnest in his passion for serving the underprivileged and rooting out corruption. #NTR #MaverickMessiah pic.twitter.com/U6DICesJFW
— Vice-President of India (@VPIndia) February 18, 2021
‘స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఆడబిడ్డలకు ఆస్తి హక్కు, రాజకీయాల్లో మహిళలకు ప్రాతినిధ్యం, రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలతో, విధానాలతో పేదల సంక్షేమం కోసం పాటు పడ్డారు. అవినీతిని అంతం చేసేందుకు ఉప లోక్ పాల్ చట్టాన్ని తీసుకొచ్చారు’ అని వెంకయ్య కీర్తించారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే చారిత్రక విజయాన్ని కైవసం చేసుకున్న ఎన్టీఆర్తో తనకున్న అనుబంధం మధురమైనదని వెంకయ్య వ్యాఖ్యానించారు. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధికి ఎన్టీఆర్ విశిష్ట సేవలు అందించారన్నారు. రాజకీయాల్లో నూతన ఒరవడిని తీసుకొచ్చిన ఎన్టీఆర్ ప్రజా జీవితాన్ని చక్కగా అక్షర బద్ధం చేశారని రచయిత కందుల రమేశ్ ను అభినందించారు. ఎన్టీఆర్ ఖ్యాతి తెలుగు వారికే పరిమితం కాకూడదంటూ ఆయన ఆంగ్లంలో కూడా ప్రసంగించారు. ఎన్టీఆర్పై మరెన్నో విశ్లేషణాత్మక రచనలు రావాలని ఆయన ఆకాంక్షించారు.
Also Read ;-అన్నా.. మళ్లీ ఎప్పుడు పుడతావు!
NTR’s legacy is not just a matter for political historians—his wholesome humanity, candour, earnestness, exemplary discipline and fearless devotion to the cause he espoused are attributes worth emulating. #NTR #MaverickMessiah
— Vice-President of India (@VPIndia) February 18, 2021
తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్ అని ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకుడు సంజయ్ బారు అన్నారు. మదరాసీ అనే గుర్తింపును చెరిపేసి.. తెలుగు ప్రజలు ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని కొనియాడారు. ఆనాటి రాజకీయాల్లో ఓ సునామీ సృష్టించారని కీర్తించారు.
The Vice President releasing the book "Maverick Messiah – A Political Biography of N.T. Rama Rao", authored by senior journalist Shri Ramesh Kandula. #NTR #MaverickMessiah pic.twitter.com/mMjwoMcJ0g
— Vice-President of India (@VPIndia) February 18, 2021











