February 25, 2021 3:32 PM
33 °c
Hyderabad
26 ° Thu
27 ° Fri
27 ° Sat
27 ° Sun
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

మహోన్నత వ్యక్తి.. తిరుగులేని శక్తి

ఎన్టీఆర్.. తెలుగువాడి ఘన చరిత్రను దశ దిశాంతాలు చాటిన యుగపురుషుడు.

January 18, 2021 at 5:58 PM
Share on FacebookShare on TwitterShare on WhatsApp

‘ఎన్టీఆర్’ ఈ మూడక్షరాల ఈ పేరు.. మూడు దశాబ్దాల పాటు తెలుగు సినీ చరిత్రను శాసించింది. తెలుగు రాజకీయంపై చెరగని ముద్ర వేసింది. దేశ రాజకీయాలను కొత్త పుంతలు తొక్కించింది. తెలుగు వాడికి పరిచయమై ఏడు దశాబ్దాలు దాటినా.. ప్రతి గుండె గుడిలోనూ నేటికీ పూజలందుకుంటోంది. పేదవాడి గుండె చప్పుడుగా మారింది. తెలుగు వాడు ఈ పేరుని ఇంతలా ఆరాధించడానికి కారణమేంటి? ఏముంది ఆ మనిషిలో? మహాత్మా గాంధీ సైతం మరుగున పడిపోతున్న ఈ రోజుల్లో.. మరణించి పాతికేళ్లవుతున్నా.. చెక్కు చెదరని ఆ ఇమేజ్ కు కారణమేంటి? ఓ కథానాయకుడిగా ఆయన సాధించిన ఘనతా? లేదా.. ఓ మహానాయకుడిగా ఆయన చూపించిన తెగువా? అంటే.. ఇదీ.. అని కచ్చితంగా చెప్పలేని స్థితి. ఓ మహోన్నతమైన వ్యక్తిగా, తిరుగులేని శక్తిగా ఆయన సాధించిన ఘనతలు ఒకటా.. రెండా.. ఎన్నో.. ఎన్నెన్నో.. ఎన్ని చెప్పినా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి. ఎంత విన్నా.. ఇంకా వినాల్సింది ఎంతో ఉంటుంది. ఎన్ని పుస్తకాలు చదివినా.. తెలుసుకోవలసింది కొండంత మిగిలే ఉంటుంది.

పాలవాడిగా మొదలై.. పాలకుడిగా మారి..

ఎన్టీఆర్ జీవితం నేటి యువతకి ఆదర్శం. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అనే నానుడి బహుశా ఎన్టీఆర్ నుంచే పుట్టిందేమో! తండ్రికి సహాయంగా పాలమ్మిన వ్యక్తి.. తదనంతర కాలంలో సినీ రంగంలోకి అడుగుపెట్టి.. తిరుగులేని కథానాయకుడిగా మూడు దశాబ్దాలపాటు తెలుగు సినీ సామ్రజ్యాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలాడు. జానపథ కథానాయకుడిగా నాటి యువతను ఉర్రూతలూగించాడు. కలల రాకుమారుడిగా నిలిచాడు. శ్రీకృష్ణుడు, శ్రీమహావిష్ణువు, రాముడు, భీముడు, అర్జునుడు, శివుడు, వేంకటేశ్వరుడు, భీష్ముడు లాంటి పురాణ పాత్రలతో మెప్పించి.. తెలుగు వారి ఇంట దేవుడిగా వెలిశాడు. ఈ క్రమంలో వచ్చిన లవకుశ సినిమా.. ఈ తారకరాముడ్ని ఆ కోదండరాముడిగా మార్చేసింది. ఈ సినిమా సాధించిన కొన్ని రికార్డులైతే.. ఇప్పటికీ చెక్కు చెదర లేదు. ఎక్కువ టిక్కెట్లు తెగిన తెలుగు సినిమాగా ఇప్పటికీ చరిత్రలో నిలిచే ఉంది. ఈ సినిమాకు దాదాపు 16 కోట్ల టిక్కెట్లు తెగాయని ఓ అంచనా! అంటే.. ఇప్పటి కలెక్షన్ల లెక్కల ప్రకారం చూసుకుంటే.. 16 వందల కోట్లకు పైగా వసూలు చేసిందన్నమాట!

Must Read ;- తారకరాముడి పట్టాభిషేకానికి 38 ఏళ్లు..

అవతార పురుషుడు.. ఈ తారకరాముడు!

మహా విష్ణువు 11వ అవతారంగా ఎన్టీఆర్ ను కొలిచేవారు జనం. తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న ప్రతి తెలుగువాడూ.. నాడు అటు నుంచి అటే మద్రాసు వెళ్లి ఈ కలియుగ వేంకటేశ్వరుడ్ని కూడా దర్శించుకునే వాడు. రాముడిగా, కృష్ణుడిగా ఆయన ఫొటోలను మతాలకు అతీతంగా ప్రతి ఇంట్లోనూ పూజ గదిలో ఉంచుకుని పూజించేవారు. ఈ స్థాయి.. ప్రపంచంలో ఏ నటుడికీ లేదు. దేవుడి పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన ఎన్టీఆర్.. పురాణాల్లోని ప్రతినాయక పాత్రలకు కూడా అదే స్థాయిలో ఇమేజ్ తీసుకొచ్చారు. రావణాసురుడిగా, కర్ణుడిగా, సుయోధనుడిగా, కీచకుడిగా ప్రేక్షకులను మెప్పించాడు. వారిలోని మంచి గుణాలను వెలుగులోకి తీసుకురావడం ద్వారా.. వారిని హీరోలుగా మార్చాడు. దానవీరశూర కర్ణలో కర్ణుడు, సుయోధనుడి పాత్రలను మలచిన విధానమే ఇందుకు నిదర్శనం. ఆ సినిమాలో ఈ పాత్రలు మరణించేటప్పుడు కంటతడి పెట్టని ప్రేక్షకుడు ఉండడు. ఆ స్థాయిలో ఆ పాత్రలకు జీవం పోశారాయన. అలాగే, రావణుడిలోని ఓ గొప్ప వ్యక్తిని ప్రేక్షకులకు పరిచయం చేశారు ఎన్టీఆర్.

బహుముఖ ప్రజ్ఞాశాలి..

ఎన్టీఆర్ కేవలం నటుడు మాత్రమే కాదు. గొప్ప సృజనాత్మకత కలిగిన ఓ సృష్టికర్త. మహా దర్శకుడు. గొప్ప రచయిత. అద్భుతమైన నిర్మాత. 16 సినిమాలకు ఆయన దర్శకత్వం వహిస్తే.. ఒకటి రెండు మినహా.. దాదాపు అన్నీ హిట్సే. అన్నీ కళాఖండాలే. ఎందరో గొప్పగొప్ప నటులను, సాంకేతిక నిపుణులను తెలుగు తెరకు పరిచయం చేశారాయన. చారిత్రక పాత్రల్లోనూ తనదైన ముద్ర వేశారు ఎన్టీఆర్. పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, చాణక్య చంద్రగుప్త లాంటి సినిమాలతో చారిత్రక విజయాలు అందుకున్న ఆయన.. వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాతో ఓ కొత్త చరిత్రనే సృష్టించారు. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పట్టో ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. జనం బళ్లుకట్టుకుని తండోపతండాలుగా ఈ సినిమా చూడడానికి వచ్చేవాళ్లు.

Also Read ;- వెండితెరకు వెలుగులద్దిన ధ్రువ‘తారక’ రాముడు (ఎన్టీఆర్ 25 వర్ధంతి)

సాంఘికాల్లోనూ సరికొత్త చరిత్ర

పౌరాణిక, జానపద, చారిత్రక సినిమాలే కాదు.. సాంఘిక పాత్రలతోనూ ఆకట్టుకున్నారు ఎన్టీఆర్. ఆ సినిమాలతోనూ సంచలనాలు సృష్టించారు. గుండమ్మకథ, మిస్సమ్మ, కథానాయకుడు, దేశోద్దారకులు, గుడిగంటలు, రక్తసంబంధం, ఆత్మబంధువు, కలసి ఉంటే కలదు సుఖం, నిప్పులాంటి మనిషి, ఉమ్మడి కుటుంబం, కోడలు దిద్దిన కాపురం, తల్లా పెల్లామా లాంటి సినిమాలతో సాంఘికాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. ఇక కలర్ యుగంలోనైతే ఆయనకు తిరుగులేదనే చెప్పొచ్చు. అడవిరాముడి నుంచి హీరోగా ఆయన ఇమేజ్ ఆకాశాన్ని దాటిపోయింది. వేటగాడు, యమగోల, డ్రైవర్ రాముడు, గజదొంగ, యుగంధర్, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి సినిమాలతో తారాపథంలో దూసుకెళుతుండగానే సినిమాలకు స్వస్తి చెప్పి.. ప్రజాసేవ బాటపట్టారు. ఎన్టీఆర్ మొత్తం 302 సినిమాల్లో నటించగా.. అందులో.. దాదాపు 240 పైచిలుకు సినిమాలు హిట్సే. ఈ రికార్డు ఏ హీరోకీ లేదు. ఇక ఉత్తమ నటుడిగానూ, దర్శకుడిగానూ, నిర్మాతగానూ ఆయన రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారు.

చరిత్రాత్మకం.. ఆయన రాజకీయ ప్రస్థానం..

అది 1982.. మార్చి 29.. తెలుగు సినిమా రారాజు ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశం చేసిన రోజు. హైదరాబాద్ లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ లో.. ఉద్విగ్నభరిత వాతావరణంలో.. ఉద్వేగపూరితంగా ప్రసంగిస్తూ.. తన పార్టీ పేరును ప్రకటించారు ఎన్టీఆర్. ‘తెలుగుదేశం పార్టీ’.. ఈ పేరే అప్పట్లో ఓ సంచలనం. రాజకీయాల్లో ఆయన వేసిన ప్రతి అడుగూ ఓ ప్రభంజనం. 19 రోజుల్లో రాష్ట్రంతా పర్యటించి.. ఓ ప్రజా ప్రభంజనం సృష్టించారు. కేవలం 9 నెలల్లోనే అధికార పగ్గాలు అందుకుని గిన్నీస్ రికార్డల్లోకి ఎక్కారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భాషకు మించి ప్రాచుర్యం పొందారు. ఆ ప్రాచుర్యం ఎలాంటిదంటే.. తెలుగు భాషకు ఎన్టీఆర్ లాంగ్వేజీగా విదేశాల్లో గుర్తింపు దక్కేంత. నాటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్.. స్వయంగా ఎన్టీఆర్ గెలుపు గురించి ఆరా తీశారంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఆయన ఖ్యాతి ఏ స్థాయిలో ఉండేదో! నాటి ప్రధాని ఇందిరను ఎదిరించి, గెలిచి, నిలిచిన ఒకే ఒక్కడు ఎన్టీఆర్.

Also Read ;- ఎన్టీఆర్ అమర్ రహే!: ముత్తాతకు మునిమనవడి శ్రద్ధాంజలి

సంక్షేమానికి ఆద్యుడు..

దేశంలోనే సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్. టీడీపీ నినాదమే.. పేదవాడికి కూడు, గుడ్డ, నీడ అందించడం. ఇందుకోసం ఆయన అహరహం శ్రమించారు. నాడు రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉండేవి. పేదవాడికి అన్నం ఎలా ఉంటుందో కూడా తెలియని రోజులు. గంజి.. లేదంటే జొన్న సంగటి. ఇది తప్ప మరో ఆహారం తెలియదు వాడికి. ఇలాంటి స్థితిలో అలాంటి వారికి అన్నం రుచి చూపించారు ఎన్టీఆర్. రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారు. ఈ పథకాన్ని నాటి కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఖజానా ఖాళీ అయిపోతుందన్నారు. అయినా ఎన్టీఆర్ పట్టించుకోలేదు. దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా అప్పట్లో ఈ పథకాన్ని తీవ్రంగా విమర్శించారు. పేదరికం పోగొట్టడానికి ఇది మార్గం కాదన్నారు. దీనివల్ల ప్రజలు సోమరిపోతులవుతారు అన్నారు. కానీ, ఆ తర్వాత కాలంలో ఆయనే ఈ పథకాన్ని మెచ్చుకున్నారు. పేదరికం తొలగించేందుకు ఇంతకన్నా మార్గం లేదంటూ అన్నగారిపై పొగడ్తల వర్షం కురిపించారు. నాడు విమర్శించిన కాంగీయులే ఆ తర్వాత కాలంలో రూపాయికి కిలో బియ్యం ఇవ్వడం విశేషం.

ఇక అన్నగారి మరో పథకం.. జనతా వస్త్రాల పంపిణీ. పేదవారికి సగం ధరకే చీరలు, దోవతులు అందించారు ఎన్టీఆర్. అందరూ ఒంటి నిండా బట్టలు ధరించేలా చేయడమే ఈ పథకం ఉద్దేశం. ఇక పక్కా ఇళ్లు. అన్నగారు అధికారంలోకి రాకముందు వరకు పేదలకు ప్రభుత్వం గుడిసెలు మాత్రమే కట్టించేది. అది కూడా గోడలు లేని గుడిసెలు. గాలి వీస్తే ఎగిరిపోయే గుడిసెలు. ఎన్టీఆర్ అధికారం చేపట్టగానే.. ఆ గుడిసెల స్థానంలో వారికి స్లాబ్ తోటి మూడు గదుల ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఇలా కొన్ని లక్షల ఇళ్లు నిర్మించారు ఎన్టీఆర్. ఇది అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక గ్రామాల్లో ఏళ్లుగా పాతుకుపోయిన పటేల్, పట్వారీ వ్యవస్థని ఒక్క రాత్రిలో రద్దు చేసి సంచలనం సృష్టించారు ఎన్టీఆర్. వాటి స్థానే మండల వ్యవస్థను తీసుకొచ్చి.. రెవెన్యూలో పెను మార్పులు చేశారు. పాలనను ప్రజల ముంగిటకు తీసుకొచ్చారు. రైతులకు రూ. 50లకే హార్స్ పవర్ విద్యుత్తు అందించారు. ఇక మహిళల కోసం ఆయన చేసినంతగా ఎవరూ చేసి ఉండరు. వారికి ప్రత్యేకంగా ఓ యూనివర్సిటీని స్థాపించారు.

దేశంలోనే తొలి మహిళా యూనివర్సిటీ ఇదే కావడం గమనార్హం. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. దాన్ని తన ఇంటి నుంచే మొదలెట్టారు. అప్పుడెప్పుడో 1984లో ఆయన చేసిన ఈ చట్టాన్ని.. 2004లో కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేయడం విశేషం. ఇప్పుడు కేంద్రం అమలు చేస్తున్న అనేక పథకాలు.. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ అమలు చేసినవే కావడం విశేషం. నాడు ఎన్టీఆర్ తెచ్చిన తెలుగు గ్రామీణ క్రాంతి పథకమే నేటి స్వచ్ఛభారత్. అప్పట్లోనే ఎన్టీఆర్ తెలుగు మహిళా బహిర్భూమి పథకంతో ప్రజలకు మరుగుదొడ్లు కట్టిస్తే.. ఇప్పుడు మోదీ అదే పని చేస్తున్నారు. అలా ఎన్టీఆర్.. నాటి తరం నుంచి నేటి తరం వరకు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే.. ఆయన మరణించి పాతికేళ్లు దాటినా.. ఆ ఇమేజ్ చెక్కు చెదరలేదు.

Also Read ;- లక్ష్మీపార్వతి ఇంట్లో చిన్న ఎన్టీఆర్ పుట్టాడా?

నిజాయితీకి నిలువుటద్దం!

ఎన్టీఆర్.. అవినీతిని సహించేవారు కాదు. తను మాత్రమే నిజాయితీగా ఉండడం కాదు.. తన మంత్రివర్గంలోనూ, పార్టీలోనూ, చివరికి కుటుంబంలోనూ అందరూ నిజాయితీగా ఉండాలని కోరుకునే వారు. ఓ సందర్భంలో తన మంత్రివర్గంలోని ఓ మంత్రి అవినీతికి పాల్పడుతున్నాడని తెలిసి.. అతడిపై నిఘా ఉంచారు. అతడు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టించారు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. అలాగే.. ఓ ఏసీబీ డైరెక్టర్ లంచం తీసుకుంటుండగా స్వయంగా పట్టుకుని సస్పెండ్ చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. అలాగే, ఆయన అప్పుడప్పుడూ మారువేషాలు వేసుకుని ఆకస్మిక తనిఖీలకు వెళ్లేవారు. అలా ఓసారి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తిరుపతి రుయా డైరెక్టర్ ను సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రిగా తన వాహనాన్ని కుటుంబసభ్యులు వినియోగిస్తే.. ఎన్టీఆర్ సహించేవారుకారు.

విశాల దృక్పథం ఉన్న గొప్ప జాతీయవాది

ఎన్టీఆర్ కు ఆవేశపరుడిగా పేరు. ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ ఆవేశంలో తీసుకుంటుంటారని అందరూ అంటుంటారు. కానీ, మంచి ఆలోచనా పరుడని, విశాల దృక్పథం కలవారని అప్పట్లో ఆయన పీఎస్ గా పనిచేసిన జయప్రకాశ్ నారాయణ అంటుంటారు. ఓ సందర్భంలో.. కర్ణాటకతో ఆంధ్రకు జలవివాదం ఏర్పడింది. కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రకు నీళ్లు వదిలేందుకు నిరాకరించింది. అప్పుడు తెలుగుదేశం నాయకులంతా ఎన్టీఆర్ ను కలిసి కర్ణాటక వెళ్తామని, నెత్తుటేరులు పారించైనా.. నీళ్లు తీసుకువస్తామని ఎన్టీఆర్ తో అన్నారు. అప్పుడు అక్కడే ఉన్న జేపీ.. ఈ మాటలకు కంగారు పడ్డారు. ఎన్టీఆర్ ఆవేశంతో సరే అంటారేమోనని భయపడ్డారు. కానీ, ఎన్టీఆర్.. చాలా నింపాదిగా నాయకులను శాంతపరచి.. వారికి హితబోధ చేశారు. ‘‘కర్ణాటకను పాలిస్తోంది ఎవరు? పాకిస్తాన్ వాళ్లా? చైనా వాళ్లా? వాళ్లు కూడా భారతీయులే కదా! అక్కడి వాళ్లూ మన వాళ్లే కదా.. ముందు వాళ్లనే నీళ్లు వాడుకోమందాం. మిగిలినవే మనం తీసుకుందాం’’ అని సర్ది చెప్పారు. వెంటనే కర్ణాటక సీఎంతో ఫోన్లో మాట్లాడి.. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేశారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. ఆయన ఎంత గొప్ప వ్యక్తో తెలియడానికి అని అంటారు జేపీ. ఇప్పుడున్న రాజకీయ నాయకుళ్లా.. ఆయన స్వార్ధంతో ఆలోచించేవారు కాదు.

ప్రాంతీయ తత్వాలను, మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూసే వారు కాదు. నీతి నిజాయితీ, చిత్తశుద్ధితో ప్రజాసేవకు అంకితమైన గొప్ప మానవతావాది ఎన్టీఆర్. ఒక్క అవినీతి మరక కూడా అంటని సచ్ఛీలుడు ఎన్టీఆర్. నిజంగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకూ ఎన్టీఆర్ అవసరం ఉంది. ఆయన లాంటి నాయకత్వం అవసరం ఉంది. ఢిల్లీ గద్దెకు మొక్కుతున్న మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్క సారి ఆయన జీవిత పాఠాన్ని చదివి .. ఆ సారాన్ని ఒంటబట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మనిషి ఈ భూమ్మీద తిరుగాడాడంటే.. భవిష్యత్తులో మన తెలుగు వాళ్లు కూడా బహుశా నమ్మరేమో! దేవుడు తన కోసం, తన రూపంలో, తనకు నచ్చిన విధంగా చెక్కుకున్న శిల్పం ఆయన. దేవుడు చేసిన బంగారు మనిషి మన ఎన్టీఆర్.

Also Read ;- అన్నా.. మళ్లీ ఎప్పుడు పుడతావు!

Previous Post

అధికారం ఎవడబ్బసొత్తూ కాదు.. : మాజీ ఎంపీ పొంగులేటి

Next Post

కేటీఆర్‌తో హనుమ విహారి భేటీ.. అసలు కారణం అదేనా?

Related Posts

Tollywood

మార్చ్ 11న పవర్ స్టార్ అభిమానులకు పండగే .. !

by Leo RK
February 25, 2021 3:24 pm

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో కమ్ బ్యాక్ అవుతోన్న...

Tollywood

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

by Leo RK
February 25, 2021 2:39 pm

యాంకర్ గా, బిగ్ బాస్ 3 రన్నరప్ గా ఫేమస్ అయిన  శ్రీముఖి...

Andhra Pradesh
chandrababu

ఇంకెన్నాళ్లీ హత్యా రాజకీయాలు: చంద్రబాబు

by chamundi G
February 25, 2021 2:11 pm

ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేసిన జగన్ ప్రభుత్వం.. హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు....

Tollywood

పవర్ స్టార్ , హరీశ్ శంకర్ మూవీకి క్రేజీ ఆర్ట్ డైరెక్టర్

by Leo RK
February 25, 2021 2:04 pm

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. వకీల్ సాబ్ మూవీతో మళ్ళీ కమ్...

Andhra Pradesh
panchayat elections

ఏకగ్రీవ పంచాయతీలకు రూ.100 కోట్లు!

by chamundi G
February 25, 2021 1:41 pm

రాష్ట్రంలో మంత్రులు పోటీపడి మరీ ఏకగ్రీవాలు భారీగా నమోదు చేయించడంతో.. మొత్తం 2,197...

Andhra Pradesh

దుర్గ గుడిలో అక్ర‌మాలు నిజ‌మే‌.. వెల్లంప‌ల్లి బుక్కైన‌ట్టే?

by లియో డెస్క్
February 25, 2021 1:14 pm

దుర్గ గుడిలో అక్ర‌మాలు నిజ‌మే‌నని ఏసీబీ సోదాల్లో తేలడంతో ఆ శాఖ మంత్రి...

Tollywood

‘ఆచార్య’ సెట్లో తండ్రీ కొడుకుల హల్ చల్ .. వైరల్ అవుతోన్న ఫోటోలు

by Leo RK
February 25, 2021 12:38 pm

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’  ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో చిత్రీకరణ...

National
disha ravi

ప్రభుత్వంతో విభేదించడం.. దేశద్రోహమెలా అవుతుంది..!

by chamundi G
February 25, 2021 12:29 pm

టూల్‌ కిట్‌ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో...

Kollywood

కంగనా రనౌత్ ‘తలైవి’ చిత్రం విడుదల తేదీ ఖరారు

by Leo RK
February 25, 2021 12:06 pm

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ .. కంగనా రనౌత్ నటిస్తోన్న తాజా చిత్రం ‘తలైవి’....

Andhra Pradesh

విశాఖ మేయర్ బరి.. అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తులు

by లియో డెస్క్
February 25, 2021 12:05 pm

( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) విశాఖ మేయర్ బరిలో నిలిపే...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

టీవీ డిబేట్ లైవ్ లో బీజేపీ కీలక నేతకు చెప్పుదెబ్బలు

నాడు జీవిఎల్.. నేడు విష్ణు.. ‘చెప్పు’కోక తప్పదు

కుప్పంకు చంద్రబాబు.. జ‌గ‌న్ శిబిరంలో టెన్ష‌న్

టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌… ప‌రాభ‌వాన్ని వైసీపీ గుర్తించిందా?

విశాఖ మేయర్ బరి.. అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తులు

నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ శ్రుతి సిన్హా అరెస్ట్ !

దుబాయ్ థీమ్ పార్క్ లో పిల్లలతో అల్లరి చేస్తోన్న అల్లు అర్జున్

ఘట్ కేసర్ కిడ్నాప్ డ్రామా యువతి ఆత్మహత్య..

కిడ్నాప్ డ్రామా ఖరీదు.. ఆ యువతి ప్రాణం..!

రేషన్ పంపిణీ మళ్లీ డీలర్ల చేతికే..

ముఖ్య కథనాలు

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

దుర్గ గుడిలో అక్ర‌మాలు నిజ‌మే‌.. వెల్లంప‌ల్లి బుక్కైన‌ట్టే?

‘ఆచార్య’ సెట్లో తండ్రీ కొడుకుల హల్ చల్ .. వైరల్ అవుతోన్న ఫోటోలు

కంగనా రనౌత్ ‘తలైవి’ చిత్రం విడుదల తేదీ ఖరారు

సొగసుల సముద్రం బిపాసా బసు 

నేను మీతోనే ఉన్నాను..విద్యార్థులకు షర్మిల భరోసా

ఫస్ట్ లుక్ : ‘శ్యామ్ సింగరాయ్’ గా అదరగొట్టిన నానీ

మోహన్ లాల్ పుత్రికోత్సాహం

లక్ష కోట్లను ఆవిరి చేసిన ఎలాన్ మస్క్ ట్వీట్..

దుబాయ్ థీమ్ పార్క్ లో పిల్లలతో అల్లరి చేస్తోన్న అల్లు అర్జున్

సంపాదకుని ఎంపిక

ఆందోళనలు చేస్తున్నా.. విశాఖ ఉక్కుపై వెనక్కి తగ్గని కేంద్రం

దుర్గ గుడిలో అక్ర‌మాలు నిజ‌మే‌.. వెల్లంప‌ల్లి బుక్కైన‌ట్టే?

అక్షరాస్త్రం.. పింక్ టెస్టులో తొలిరోజు ఇంగ్లాండ్ విలవిల

అన్నాడీఎంకే తాను వేరు కాదంటున్న చిన్నమ్మ.. పార్టీకే ఎసరు పెట్టే స్కెచ్

నేను మీతోనే ఉన్నాను..విద్యార్థులకు షర్మిల భరోసా

మోడీ కలల స్టేడియం.. రాష్ట్రపతి ప్రారంభోత్సవం

టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌… ప‌రాభ‌వాన్ని వైసీపీ గుర్తించిందా?

కుప్పంకు చంద్రబాబు.. జ‌గ‌న్ శిబిరంలో టెన్ష‌న్

కిడ్నాప్ డ్రామా ఖరీదు.. ఆ యువతి ప్రాణం..!

నాడు జీవిఎల్.. నేడు విష్ణు.. ‘చెప్పు’కోక తప్పదు

రాజకీయం

ఆందోళనలు చేస్తున్నా.. విశాఖ ఉక్కుపై వెనక్కి తగ్గని కేంద్రం

ఇంకెన్నాళ్లీ హత్యా రాజకీయాలు: చంద్రబాబు

ఏకగ్రీవ పంచాయతీలకు రూ.100 కోట్లు!

దుర్గ గుడిలో అక్ర‌మాలు నిజ‌మే‌.. వెల్లంప‌ల్లి బుక్కైన‌ట్టే?

ప్రభుత్వంతో విభేదించడం.. దేశద్రోహమెలా అవుతుంది..!

విశాఖ మేయర్ బరి.. అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తులు

‘నడి సంద్రం’లో రాహుల్ గాంధీ..!

అన్నాడీఎంకే తాను వేరు కాదంటున్న చిన్నమ్మ.. పార్టీకే ఎసరు పెట్టే స్కెచ్

వంటింట్లో కరెంటు స్తంభం..

అమరావతి ఉద్యమానికి 436 రోజులు!

సినిమా

మార్చ్ 11న పవర్ స్టార్ అభిమానులకు పండగే .. !

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

పవర్ స్టార్ , హరీశ్ శంకర్ మూవీకి క్రేజీ ఆర్ట్ డైరెక్టర్

‘ఆచార్య’ సెట్లో తండ్రీ కొడుకుల హల్ చల్ .. వైరల్ అవుతోన్న ఫోటోలు

కంగనా రనౌత్ ‘తలైవి’ చిత్రం విడుదల తేదీ ఖరారు

సొగసుల సముద్రం బిపాసా బసు 

నిఖిల్ సరసన అనుపమా పరమేశ్వరన్? మళ్లీ ఫామ్ లోకి వస్తుందా?

ఫస్ట్ లుక్ : ‘శ్యామ్ సింగరాయ్’ గా అదరగొట్టిన నానీ

సరిగ్గా నెల రోజుల తేడాతో నితిన్ నుంచి రెండు సినిమాలు

మోహన్ లాల్ పుత్రికోత్సాహం

దుబాయ్ థీమ్ పార్క్ లో పిల్లలతో అల్లరి చేస్తోన్న అల్లు అర్జున్

జనరల్

ఆందోళనలు చేస్తున్నా.. విశాఖ ఉక్కుపై వెనక్కి తగ్గని కేంద్రం

కోటి 20 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్..

కిడ్నాప్ డ్రామా ఖరీదు.. ఆ యువతి ప్రాణం..!

సినీ కరీనా బతుకు ఎరీనాలోకి మరో బిడ్డ

రవితేజ 68వ సినిమా ఎనౌన్స్ మెంట్!

సెల్ఫీ సరదా చావుకొచ్చింది..

నాసాలో మన భారతీయ మహిళ ‘స్వాతి మోహన్’..

JC Prabhakar Reddy Strong Counter to AP Volunteers | YS Jagan | AP Panchayat Elections | Leo News

పాతికేళ్లు గొంతులోనే ‘విజిల్’

మార్చి 1 వరకు ఫాస్టాగ్ ఫ్రీ!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist