అధికార పార్టీ నాయకుడు విజయ సాయి రెడ్డి పొద్దున్నే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును టార్గెట్ చేసినట్టున్నారు. నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోయాడని గుర్తు చేస్తూ.. ఇక తొందరలో తండ్రికి కూడా అదే గతి పడుతుందని సోషల్ మీడియా వేదికగా ఎద్దేవ చేశారు. ‘ఎన్నికలకు వెళ్దాం రండి అని చంద్రబాబు సవాలు చేశాడు. మంగళగిరిలో కొడుకుని ఓడగొట్టుకున్న చంద్రబాబు కు ఈసారి కుప్పం కూడా గోవిందా… గోవిందా! కావాలంటే తన ఎమ్మెల్యేల అందరితో రాజీనామా చేసి రెడీ కావాలి.’
ఈ మధ్య అమరావతి రైతులకు మద్దతుగా జరిగిన ‘జనభేరి’ కార్యక్రమంలో చంద్రబాబు అధికార పార్టీ నాయకులు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ మాటకు కౌంటర్గా విజయ సాయి రెడ్డి ఇలా సమాధానం చెప్పినట్లున్నారు.
Must Read ;- విజయసాయి రెడ్డి జే-టర్న్.. మద్దతుకి మరో సాక్ష్యమా..