‘కలర్ ఫోటో’ లాంటి హిట్ వచ్చిన హీరో సుహాస్ కు మరో సినిమాలోనూ హీరో అవకాశం వచ్చేసింది. సుహాస్ కెరీర్ ఛాయ్ బిస్కట్ సంస్థతోనే వచ్చింది. ఇప్పుడు ఆ సంస్థ నిర్మించే సినిమాలోనే హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా పేరు ‘రైటర్ పద్మభూషణ్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో సుహాస్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు.

ఈ సినిమా ద్వారా షణ్ముఖ ప్రశాంత్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దీనికి నిర్మాతలు అనురాగ్, శరత్, చంద్రు మనోహర్. వర్ధమాన రచయిత పద్మభూషణ్ గా సుహాస్ కనిపిస్తున్నారు. అతని చేతిలో తను రాసిన పుస్తకం ‘తొలి అడుగు’ కనిపిస్తోంది. ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ అని తెలుస్తోంది. ఈ ఏడాది మధ్యలోనే ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సంస్థ ద్వారా మరికొందరు యువదర్శకులు పరిచయం కానున్నారు. త్వరలోనే కొన్ని ప్రకటనలు రానున్నాయి.











