ఓ డాక్టర్ కారణంగా 8 మంది బలైయ్యారు. మరో ఐదుగురు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటన ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో జరిగింది. అనారోగ్యం కారణంగా ఒకే కుటుంబానికి చెందిన 13 మంది స్థానిక డాక్టర్ వద్ద వైద్యం కోసం వెళ్లారు. ఆ డాక్టర్ హోమియోపతి మెడిసిన్ డ్రోసెరా 30లో నాటుసారా కలిపి ఆ కుటుంబ సభ్యులకు ఇంజెక్షన్ రూపంలో ఇచ్చాడు. దీంతో 8 మంది ఒకేసారి చనిపోగా, మిగతా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వైద్యం చేసిన డాక్టర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్కు...










