‘కెజిఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ హీరో యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హిరోయిన్ గా నటించింది. ఒక్క కన్నడ బాషలోనే కాకుండా విడుదలైన ప్రతీ భాషలోనూ సెన్సేషనల్ విజయం సాధించింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న సౌత్ ఇండియన్ సినిమా ఏదైనా ఉంది అంటే అది ‘కెజిఎఫ్’ మాత్రమే. ఇందులోని ప్రతీ పాత్ర చాలా సహజంగా ఉంటుంది.
ప్రస్తుతం ‘కెజిఎఫ్ – 2’ సినిమా కోసం ఎప్పటి నుండో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది. తిరిగి ఈ మధ్యనే ప్రారంభించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ‘కెజిఎఫ్ – 2’ సినిమా షూటింగ్ ఆఖరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అందుకోసం హీరో యష్ నవంబర్ 26వ తేదీన హైదరాబాద్ కు రానున్నాడని సమాచారం. ఇంకొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మొదలుకానున్నది. ఈ షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుంది.
ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. కాకపోతే సంక్రాంతికి విడుదల అవుతుందో లేదో ఖచ్చితంగా చెప్పలేమని, కాని ఆ విధంగా ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయని ఇప్పటికే నిర్మాతలు తెలిపారు. ‘కెజిఎఫ్’ విజయంతో ‘కెజిఎఫ్ – 2’ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కోసం యష్ అభిమానులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ‘కెజిఎఫ్ – 2’ శాటిలైట్ రైట్స్ ఇప్పటికే భారీ మొత్తంలో సేల్ అయ్యాయని కన్నడ సినీ పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాత ఎన్ని కొత్త రికార్డులను నెలకొల్పుతుందో చూడాలి మరి.
Muat Read ;- లీగల్ సమస్యల్లో మాస్ మహారాజా సినిమా