గ్రేటర్ ఎన్నికలకు మరికొన్ని గంటల సమయమే ఉంది. నేతల రాతల భవితవ్యాన్ని ఓటుతో బ్యాలెట్ బాక్సులో పెట్టే సమయం ఆసన్నమైంది. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లను చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ సారి ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించనున్నారు.
మొత్తం 1122 మంది అభ్యర్థులు…
గ్రేటర్ పరిధిలో మొత్తం 150 వార్డులకు ఎన్నికలు రేపు జరగనున్నాయి. 150 వార్దుల నుంచి మొత్తం 1122 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇందులో బీజేపీ నుంచి 149 మంది బరిలో ఉండగా సీపీఐ-17, సీపీఐ(ఎం)-12, కాంగ్రెస్-146, టీఆర్ఎస్-150, ఏఐఎంఐఎం-51, టీడీపీ-106. ఇతర రికగ్నైజ్డ్ పార్టీల నుండి 76 మంది, స్వతంత్రులు-415 పోటీ చేస్తున్నారు.
ఓటర్లు, పోలింగ్ స్టేషన్ల వివరాలు..
-ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
-2927 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లు 9101.
-మొత్తం ఓటర్లు 74,67,256 ఉంటే అందులో పురుష ఓటర్లు 38,89,637. మహిళా ఓటర్లు 35,76,941. ఇతరులు 678 మంది.
-ప్రతి రెండు సర్కిళ్లకు కలిపి మొత్తం 60 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్స్. పోలింగ్ సిబ్బంది 36,404.
-రిటర్నింగ్ అధికారులు 150, అసిస్టెంట్ అధికారులు 150, ఎన్నికల పరిశీలకులు 42, మైక్రో అబ్జర్వర్స్ 1700, వెబ్ కాస్టింగ్ సిబ్బంది 2920 మంది.
– ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 2671 వాహనాలను ఉపయోగిస్తున్నారు. -దాదాపు 45 వేల మంది పోలీస్ సిబ్బందితో బందోబస్త్. మాస్కుతో వస్తేనే పోలింగ్ కేంద్రంలో అనుమతిచ్చేలా నిబంధన పెట్టారు.