యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నివారణ కోసం దేశీయ సంస్థ భారత్ బయోటెక్, భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) తో కలిసి వ్యాక్సిన్ తయారీకి కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.. కొవ్యాక్సిన్ గా వ్యవహరిస్తున్న దీని తయారీ ప్రయత్నాలు ప్రస్తుతం రెండో దశలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొనే వాలంటీర్ల సంఖ్యను తగ్గిస్తున్నట్లు పేర్కొంది. వీలైనంత త్వరగా మూడో దశ ప్రయోగాలను చేపట్టేందుకు అనువుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైదరాబాద్ కు చెందిన ఓ ఫార్మా సంస్థ పేర్కొన్నట్లు తెలుస్తుంది.
భారత్ బయోటెక్ కొవ్యాక్సిన్ తొలిదశలో 350 మంది వాలంటీర్లతో విజయవంతంగా నిర్వహించింది. ఇక రెండో దశ ప్రయోగాలను తొలుత 750 మంది వాలంటీర్లపై జరపాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఆ సంఖ్యను 380కి తగ్గించినట్లు సమాచారం. అంతే కాకుండా వ్యాక్సిన్ ప్రయోగాలు జరిగే ప్రదేశాలను సైతం సంస్థ కుదించింది. మొదటి దశ ప్రయోగాలు వయోజనులపై జరిపామని, రెండో దశలో వ్యాక్సిన్ ను 12 ఏళ్లకు పైబడిన చిన్నారులపై ప్రయోగించే ఆలోచన ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు.
ఈ రెండు దశల్లో పాల్గొన్న వాలంటీర్లలో ఇప్పటి వరకు ఏ విధమైన ఇబ్బందులు, సమస్యలు ఎదురుకాలేదని వారు స్పష్టం చేశారు. కాగా, ఈ వ్యాక్సిన్ వచ్చే ఏడాది అంటే 2021 మొదట్లో అందుబాటులోకి వచ్చే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మూడో దశ ప్రయోగాలకు కూడా భారత్ బయోటెక్ డీసీజీఐ అనుమతి పొందింది.
ఓటుతో కొట్టినా బుద్ధి మారలేదు.. అమరావతిపై జగన్ విషం
ఎన్నికల్లో ప్రజలు మూతి మీద కొట్టినట్లు జవాబిచ్చినా వైసీపీ అధినేత జగన్ తీరు...