జనవరి 2న దేశ వ్యాప్తంగా డ్రై రన్ నిర్వహించడానికి కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేయాలని కేంద్రం ఆదేశించింది. వ్యాక్సిన్ ఆమోదంపై ఏమీ తేల్చని డిసిజిఐ.. రేపు (జనవరి 1) నిపుణుల కమిటీ సమావేశం కానున్నారు. వ్యాక్సిన్పై తుది నిర్ణయం వెలువడుతుందని భారతదేశం యావత్తూ ఎదురుచూస్తుంది.
ఇప్పటికే వ్యాక్సినేషన్ కోసం 83 కోట్ల సిరంజిలకు ఆర్డర్ ఇచ్చింది ప్రభుత్వం. వ్యాక్సినేషన్ పై అత్యుత్తమ సమావేశం నిర్వహించిన కేంద్రం.. తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. మోడి స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొందరలో రాబోతుందని ప్రకటించారు. వ్యాక్సినేషన్కు సంబంధించి నిబంధనలు విడుదల చేసింది కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం.. భారత్లో మొదటి వ్యాక్సిన్ అనుమతులు కొవిషీల్డ్ అందుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ ట్రయిల్ రన్స్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించడంతో పాటు.. వ్యాక్సిన్ ధర కూడా అందుబాటులో ఉండడం వల్ల కొవిషీల్డ్కే మొదటి ప్రాధాన్యం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొవ్యాక్సిన్ మూడో దశ ట్రయిల్స్ ఇంకా కొనసాగుతుండడంతో.. పూర్తి సమాచారం లేకుండా అనుమతులు లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఇక ఫైజర్ పూర్తి సమాచారాన్ని సమర్పించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కాబట్టి కొవిషీల్డ్కి మార్గం సుగమం అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.