ఏపీ సీఎస్గా ఆదిత్యనాథ్ దాస్ అడుగుపెట్టారు. నేటితో (డిసెంబర్ 31) నీలం సాహ్ని బాధ్యతలు ముగియనున్న నేపథ్యంలో ఆదిత్యనాథ్.. ఆమె నుంచి బాధ్యతలను అందుకున్నారు. సీఎస్గా పదవీ విరమణ చేసిన నీలం సాహ్నికి సిఎం ముఖ్య సలహాదారుగా పదవిని అప్పగించింది ప్రభుత్వం. మునుపు జలవనరుల శాఖ ప్రదాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్.. జగన్ ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రానికి నేటి నుండి సిఎస్గా వ్యవహరించనున్నారు.
పురపాలకశాఖ కార్యదర్శిగా బాధ్యతులు నిర్వహిస్తున్న జె. శ్యామలరావును జనవనరులశాఖ కార్యదర్శిగా నియమించింది ప్రభుత్వం. సిఎస్గా ఆదిత్యనాథ్ను ఎంపిక చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఐఏఎస్ శ్రీలక్ష్మిని పురపాలకశాఖ కార్యదర్శిగా నియమించింది.











