విశాఖలో కరోనా కల్లోలం రేపుతోంది. ఉన్నతాధికారులతో పాటు, మంత్రి అవంతి శ్రీనివాస్, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్థరణ అయింది.అవంతి భార్య జ్ఙానేశ్వరి, సోదరుడు మహేష్, పీఏలకు కరోనా పాజిటివ్గా నిర్థరణ కావడంతో చికిత్స అందిస్తున్నారు.ఇక ఇప్పటికే విశాఖలో కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ సహా పలువురు ఉన్నతాధికారులు కరోనా బారిన పడ్డారు.దీంతో మిగిలిన అధికారులు ఇంటికే పరిమితం అయ్యారు.ఇంటి వద్ద నుంచే విర్చువల్ విధానంలో ఆన్ లైన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
మరో మంత్రి అనిల్కు కరోనా పాజిటివ్
ఏపీ జలవనరుల మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు కరోనా పాజిటివ్గా నిర్థరణ అయింది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.ఇప్పటికే మంత్రి అనిల్ యాదవ్ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కార్పొరేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో మంత్రి కూడా కరోనా బారిన పడ్డారని సమాచారం అందుతోంది.అయితే ఈ విషయం మాత్రం ఎక్కడా వెల్లడించకుండా జాగ్రత్త పడుతున్నారు. వారం రోజులుగా ఎవరికీ అందుబాటులో లేకుండా హైదరాబాద్ చేరుకోవడంతో వారు కరోనా చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. మంత్రులకు కరోనా సోకిన విషయాలను వెల్లడించడం లేదు.ప్రజల్లో కరోనా ఆందోళన మరింత పెరిగే ప్రమాదం ఉందని ఈ జాగ్రత్తలు పాటిస్తున్నట్టు తెలుస్తోంది.