ఐపీఎల్ ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి వ్యక్తిగత కారణాలతో సురేష్ రైనా తప్పుకున్న సంగతి తెలిసిందే. తన మేనత్త భర్త హత్యతో ఆయన తిరిగి వచ్చాడని వార్తలు ప్రచారం జరిగాయి. ఇదే సమయంలో హోటల్ రూము విషయంలో రైనా జట్టు యాజమాన్యంతో గొడవకు దిగాడని వార్తలు వినబడ్డాయి. దీనిని దృష్టిలో పెట్టుకొనే చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ పరోక్షంగా రైనాను విమర్శలు చేశారు. రైనాకు విజయగర్వం తలకెక్కిందని ఆరోపణలు చేసినట్లు వార్తలు ప్రచారం జరిగాయి. దీనిపై వివరణ ఇస్తూ శ్రీనివాసన్ తాను ఆ మాటలు అనలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. రైనా కూడా దీనిపై స్పందిస్తూ… ఆయన తన తండ్రిలాంటి వారని ఎంతో వినయంగా బదులిచ్చి వివాదానికి బ్రేకులు వేసే ప్రయత్నం చేశాడు.
ఇండియాకి తిరిగి వచ్చే కారణమేంటో రైనా చెప్పకుండా తన మామయ్య కేసును వేగవంతంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైనా తప్పుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కష్టాల్లో పడింది. మిడిల్ ఆర్డర్ లో బలమైన ఆటగాడు రైనా తప్పుకోవడంతో ఆ స్థానంలో సరైన ఆటగాడు దొరక్కా చెన్నై జట్టు యాజమాన్యం ఇబ్బందులు ఎదురుకొంటోంది. దీంతో రైనాపై సీఎస్కే జట్టు తీవ్రమైన కోపంలో ఉన్నట్లు వార్తలు ప్రచారం జరిగాయి. ఆ వార్తలకు తగ్గట్లే తాజాగా సీఎస్కే వాట్సాప్ గ్రూపు నుంచి రైనాను తప్పించారు. దీంతో క్రీడా వర్గాలు షాక్ అయ్యాయి. సీఎస్కే జట్టు విజయాలలో రైనా ఎన్నోసార్లు కీలక పాత్ర పోషించారు. అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడి జట్టుకు విజయాలు అందించిన రైనా విషయంలో జట్టు యాజమాన్యం ప్రవర్తించే తీరు సరిగా లేదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.