మెగాస్టార్ చిరంజీవి .. ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెడుతూ.. యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్నారు. ‘ఆచార్య’ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉండగా.. తదుపరిగా ‘లూసిఫర్’ రీమేక్ ను పట్టాలెక్కించ బోతున్నారు. అలాగే తమిళ ‘వేదాళం’ రీమేక్ మూవీ కూడా లైన్ లో ఉంది. దీంతో పాటు బాబీ దర్శకత్వంలో కూడా ఓ సినిమా ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో చిరు .. నెక్స్ట్ మూవీపై కూడా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
ఎర్లియర్ గా .. మహేశ్ బాబు తో ‘మహర్షి’ లాంటి సూపర్ హిట్ మూవీ తీసిన వంశీ పైడిపల్లి.. మెగాస్టార్ కోసం ఓ స్టోరీ రెడీ చేస్తున్నాడని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇప్పుడు వంశీ మరో స్టెప్ ముందుకేసి.. చిరంజీవికి కథ వినిపించాడని సమాచారం. ఒక సందేశాత్మక కథాంశంతో పాటు వినోదం కూడా పుష్కలంగా ఉండేలా ఆ కథను రూపొందించాడట వంశీ.
అయితే చిరంజీవి ఈ కథ పై ఎలాంటి స్పందన తెలియచేయలేదని.. బహుశా ఆయన .. తదుపరి మూడు సినిమాల్ని కూడా పట్టాలెక్కించిన తర్వాత వంశీ కథపై .. నిర్ణయం తీసుకుంటారని ఫిల్మ్ నగర్ టాక్. మరి వంశీ పైడిపల్లి సినిమాకి చిరు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి.
Must Read ;- మెగాస్టార్ ‘లూసిఫర్’ రీమేక్ మూవీ లో విలన్ ఇతడేనా?