దేశవ్యాప్తంగా పలు చోట్ల బెడ్ల కొరత, ఆక్సిజన్ కు డిమాండ్ ఏర్పడుతున్నాయి. అనేక రాష్ట్రాలు ఆక్సిజన్ లభ్యత లేక కేంద్రానికి మొరపెట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను రాష్ట్రాలకు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రత్యేకంగా ప్రాణవాయువు తరలింపు కోసం ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లు నడపాలని కేంద్రం రైల్వే శాఖను కోరింది. ఈ నిర్ణయంతో ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలపై పరుగులు పెట్టనుంది. ఖాళీ ట్యాంకర్లు ముంబై నుంచి వైజాగ్, జంషెడ్ పూర్, రుర్కేలా, బొకారోల నుంచి ద్రవ రూప ఆక్సిజన్ తరలనుంది. రైళ్లు ఆక్సిజన్ను సేకరించిన తర్వాత డిమాండ్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు సరఫరా చేస్తామని రైల్వే శాఖ వెల్లడించింది.
Must Read ;- రికార్డుస్థాయిలో ఏపీ : 6,582 మందికి కరోనా పాజిటివ్, 22 మంది మృతి











