సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేవారే రాణిస్తారు. అంబానీ సామ్రాజ్యం ఈ సిద్ధాంతాన్ని బాగా వంటబట్టించుకుంది. రిలయన్స్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరూభాయ్ అంబానీ ఈ సిద్ధాంతాన్ని చక్కగా అమలు చేశారు. ప్రజలకు అవసరమైన ప్రతి రంగంలోకి అడుగుపెట్టిన రిలయన్స్ మహా సామ్రాజాన్ని నిర్మించారు. ఆ తరువాత ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీలు సామ్రాజ్యా బాధ్యతలు తీసుకున్నారు. అన్న ముకేశ్ అంబానీ సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతుంటే తమ్ముడు అనిల్ మాత్రం విఫలం చెంది సంపద కోల్పయి అప్పుల ఊబిలో చిక్కుకున్నారు.
పైపైకి ముకేశ్
కరోనా మహమ్మారితో దేశవ్యాప్తంగా అన్నీ రంగాలు కుదేలయ్యాయి. దీంతో సామాన్యులే గాక బిజినెస్ టైకూన్స్ కూడా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. కానీ ముకేశ్ ఆదాయం మాత్రం భారీగా పెరిగింది. మిగిలినవారిలో పోలిస్తే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భారీ సంపాదనతో దూసుకుపోయారు. దేశంలో అప్పులు లేని కంపెనీగా రిలయన్స్ సంస్థ నిలిచింది. టెక్నాలిజీకి పెద్ద పీట వేస్తూ స్థాపించిన జియో ముకేశ్ కు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఇదే సమయంలో ముకేశ్ పెట్టుబడులను స్వీకరణకు దిగడంతో బహుళజాతి కంపెనీలు రిలయన్స్ లో పెట్టుబడులు పెట్టాయి.
కరోనా కష్టకాలంలో ఆన్ లైన్ బిజినెస్ కు డిమాండ్ ఉంటుందనే ఉద్దేశంతో ముకేశ్ దీనిపై ద్రుష్టి సారించారు. ఇటీవలే ఫ్యూచర్ సంస్థ నుంచి రెటైల్ మార్కెట్ ను కొనుగోలు చేసిన ముకేశ్ ఇప్పటికే ఆ బిజినెస్ ను తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇటీవలే ఇన్ఫో లైన్ సంస్థ సర్వే చెప్పిన మేరకు ముకేశ్ గంటకు 90 కోట్లు సంపాదనను ఆర్జిస్తున్నారు.
ఫోర్బ్స్ సంస్థ ర్యాంకింగ్స్
తాజాగా ఫోర్బ్స్ సంస్థ ఇండియాలో టాప్ 100 ధనవంతులు జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో ముకేశ్ అగ్రస్థానంలో నిలిచాడు. వరుసగా 13వ సారి కూడా ముకేశ్ అగ్రస్థానంలో నిలవడం విశేషం. ముకేశ్ అంబానీ 88.7 బిలియన్ డాలర్లతో మొదటిస్థానంలో నిలిచాడు. ఆయన దరిదాపులలో వేరే వారు లేకపోవడం గమనార్హం. రెండో స్థానంలో గౌతమ్ అదానీ(25.2 బిలియన్ డాలర్స్), శివ నాడార్(20.4 బిలియన్ డాలర్స్) తో మూడవ స్థానంలో నిలిచారు. మిస్త్రీ, మిట్టల్, పూనావాలా, కోటక్, హిందుజా సోదరులు తరువాతి స్థానాల్లోనే ఉన్నారు.
ఈ ర్యాంకింగ్స్ వెలువడగానే స్టాక్ మార్కెట్ లో రిలయన్స్ షేర్లు భారీగా పెరిగాయి. దీంతో ఆయన సంపద ఈ రోజుతో మరింత పెరిగింది.











