రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 10 నుంచి మరో పదిరోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే కాగా కరోనా పూర్తిగా అదుపులోకిరాని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ రూల్స్ యథాతథంగా కొనసాగనున్నాయి. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ, నియోజకవర్గాల పరిధిలో, లాక్ డౌన్ ఇప్పుడు కొనసాగుతున్న యథాతథ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. గత కేబినెట్ సమావేశం ఆదేశాలమేరకు రాష్ట్ర వైద్యాధికారుల బృందం ఈ ప్రాంతాల్లో పర్యటించింది. ఆ నియోజకవర్గాల్లో కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని, లాక్ డౌన్ యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు మాత్రమే సడలింపు ఉంటుంది.
Must Read ;- తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు