కరోనా సెకండ్ వేవ్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. ముప్పును తప్పించుకునేందుకు రాష్ట్రాలు లాక్ డౌన్ జపం చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వాధికారులు లాక్ డైన్ చర్యల్లో నిమగ్నమైతే.. ఒక్కడు మాత్రం కరోనా రోగులను ఎలా బాగు చేస్తే బాగుంటది అని ఆలోచిస్తున్నాడు. ఆ ఒక్కడు ఎవరో కాదు.. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. కరోనాపై రోగుల్లో ధైర్యం కల్పించేందుకు ఆయన యోగా, మెడిటెషన్ సెషన్స్ ను చురుగ్గా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం యోగా, ధాన్యం, చిన్నపాటి వ్యాయామాలు చేయిస్తూ వైరస్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. కోవిడ్ రోగులు, మానసికంగా, శారీరకంగా పిట్ ఉండేందుకే యోగా క్లాసులు నిర్వహిస్తున్నామని, దీనివల్ల రోగులు త్వరగా కోలుకుంటారని గంధం చంద్రుడు అభిప్రాయపడుతున్నారు. అనంతపురం జిల్లా అంతటా యోగా సెషన్స్ నిర్వహిస్తుండటంతో మంచి ఫలితాలు వస్తున్నయని ప్రజలు చెప్తున్నారు. ఇప్పటివరకు కరోనా మహామ్మారి నుంచి 1719 మంది రోగులు కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా వేళ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు ప్రభుత్వాధికారులు యోగా సెషన్స్ నిర్వహిస్తుండటం విశేషం.
Yoga, Meditation and Exercise sessions are arranged at all the #COVID Care centres in the Ananthapur district to improve the mental and physical health of people recovering from #COVID19 at these facilities. #APFightsCorona #COVID19Pandemic @ChandruduIAS @DCAnanthapuram pic.twitter.com/v7zYYLY4A9
— Health Medical and Family Welfare Department – AP (@ArogyaAndhra) May 22, 2021











