ఈటల రాజేందర్ వ్యవహరం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈటల మెడ కు మరో ఉచ్చు బిగుసుకుంటోంది. ఈటల రాజేందర్ కుమారుడు నితిన్ రెడ్డిపై సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు అందిందింది. మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామానికి చెందిన మహేశ్ అనే వ్యక్తి.. తన భూమిని నితిన్ కబ్జా చేశాడని ఫిర్యాదు చేశాడు. వెంటనే తనకు న్యాయం చేయాలని సీఎంను కోరగా, ఆయన స్పందించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, సరైన రిపోర్ట్ ఇవ్వాలని సీఎస్ సోమేష్, ఏసీబీ విజిలినెన్స్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే…
సౌత్ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..
ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...










