యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మెగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఎన్టీఆర్ పై వచ్చిన టీజర్ ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా తర్వాత ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Must Read: దర్శకధీరుడు రాజమౌళికి బీజేపీ ఎంపీ వార్నింగ్
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం సాగుతుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత కన్నడ దర్శకుడు ‘కేజియాఫ్’ ఫెమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా, అలాగే తమిళంలో ఒక్క పరాజయం కూడా లేని దర్శకుడు అట్లీతో మరొక సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. ఈ మూడు సినిమాల తర్వాత ఎన్టీఆర్ ‘మహానటి’ ఫెమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయనున్నాడు.
ఇప్పటికే ఒక కథను ఎన్టీఆర్ కు దర్శకుడు నాగ్ అశ్విన్ వినిపించాడని, ఎన్టీఆర్ కు కూడా ఆ కథ బాగా నచ్చిందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాడు. త్వరలోనే ఆ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తవుతుంది. దీని తర్వాత అశ్విన్ ప్రభాస్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలయ్యాయి. ప్రభాస్ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ చేయబోయే సినిమా ఎన్టీఆర్ తోనే అని సమాచారం. అందుకు అనుగుణంగానే ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే మరి.
Also Read: మెగా డాటర్ కుమార్తె వెబ్ సిరీస్ కు బ్రేక్?











