ఉత్తరప్రదేశ్ బిజేపీలో రాజకీయ సునామీ..!
ఉత్తరప్రదేశ్ లో రాజకీయ సునామీ అధికార బీజేపీ ని ఉక్కిరిబిక్కి చేస్తోంది! బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యే పెద్ద సంఖ్యలో అధికార పార్టీ బీజేపీని వీడి ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీలో చేరుతున్నారు. పార్టీ నేతల వరుస రాజీనామాలు యోగి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫ్రిబవరి 10 నుంచి ప్రారంభమయ్యే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ కూడా ఉంది. దేశం ఎన్నికల్లో సెమి ఫైనల్ గా భావించే యూపీ ఎన్నికలను బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా పావులు కదుపుతోంది. యూపీ ని మరోసారి దక్కించుకుని దేశ రాజకీయాలను శాసించే వ్యూహానికి అధికార బీజేపీ అడుగులు వేస్తున్న వేళా.. పార్టీ ముఖ్యనేతలు, మంత్రులు, ఎమ్మెల్యే గుడ్ బై చెప్పి.. సమాజ్ వాదీ పార్టీలో పంచన చేరుతున్నారు. పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుడుకుని ఎస్పీ తీర్థం పుచ్చుకుంటున్నారు. నిన్న కార్మిక శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య తన పదవీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతకముందు నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యే బీజేపీకి రాజీనామా చేసి, అఖిలేశ్ యాదవ్ పంచన చేశారు. ఈ షాక్ నుంచి తేరుకోకముందే బుధవారం కాషాయ పార్టీకి మరో మంత్రి గుడ్ బై చెప్పేశాడు. మంత్రి పదవికి ధారసింగ్ చౌహాన్ రాజీనామా చేశారు. యోగి ప్రభుత్వ వైకరి నచ్చకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
కలవరపాటుకు గురిచేస్తున్న రాజీనామాలు..!
ఉత్తరప్రదేశ్ లో యోగి ప్రభుత్వానికి పార్టీ నేతలు వరస రాజీనామాలతో చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే అధికార బీజేపీ నుంచి అఫిషియల్ గా ఏడుగురు ఎమ్మెల్యే రాజీనామా చేసి సమాజ్ వాదీ పార్టీలోకి చేరారు. అలానే మరో 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసేందుకు సిద్దంగా ఉన్నారని నిన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నడంతో కాషాదదళంలో కలవరం మొదలైంది. అలానే యూపీ జరగబోయే ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మాకంగా తీసుకుంటున్నాయి. అధికారం పీఠంపై శాశ్వతంగా పాగా వేయాలని అధికార బీజేపీ చూస్తుంటే.. భవిష్యత్తులో పట్టు నిలుపుకునేందుకు సమాజ్ వాధీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెలు భావిస్తున్నాయి. మరో వైపు యోగి ప్రభుత్వానికి సొంతగూటి నుంచే వ్యతిరేక పవనాలు వీస్తుండతో అధిష్టానం అయోమయంలో పడిపోయింది!