అక్కినేని నాగచైతన్య బిఫోర్ లాస్టియర్ మేనమామతో కలిసి నటించిన ‘వెంకీ మామ’.. మంచి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. అందులో ఫస్ట్ టైమ్ రాశీఖన్నాతో కలసి నటించాడు చైతూ. అలాగే.. అంతకు ముందు మనంలో కూడా ఒక సీన్ లో ఇద్దరూ కనిపిస్తారు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ ఇద్దరూ జోడీ కడుతున్నారు.
విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా ‘థాంక్యూ’. గతంలో నాగచైతన్య విక్రమ్ దర్శకత్వంలో సూపర్ హిట్ మూవీ ‘మనం’లో నటించిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవల ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ ఇటలీలోని మిలన్ లో మొదలైంది. చైతన్య, రాశీఖన్నా కాంబినేషన్ సీన్స్ జరుగుతున్నాయి. దాదాపు 20రోజుల పాటు అక్కడున్న ట్యూరిన్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటుంది. నిజానికి మిలన్ లో ప్రపంచంలో ఎక్కడా లేనంతగా కోవిడ్ కేసులున్నాయి. అందుకే ‘థాంక్యూ’ సినిమాని చిన్న యూనిట్ తో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మరీ చిత్రీకరణ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో చైతూ.. మహేశ్ బాబు వీరాభిమానిగా నటిస్తున్నాడు. ఈ నేపథ్యం సినిమాలో కీలకమని తెలుస్తోంది. మరి ఈ సినిమా చైతూకి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
Must Read : మంచువారి వారసుడి సినిమాలో అక్కినేని నాగార్జున ?











