సెట్ బ్యాక్ వదలకుండా, నిబంధనలు ఉల్లంఘించి కాంప్లెక్స్ నిర్మించారంటూ గాజువాక సెంటర్లోని పల్లా భవనాన్ని శనివారం తెల్లవారుజామున కూల్చివేశారు. సమాచారం తెలసుకున్న పల్లా అక్కడి చేరుకున్నారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని కూల్చివేయడంపై సిబ్బందిని నిలదీశారు. అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చామని చెబుతున్నరు. పల్లా శ్రీనివాసరావు భవనాన్ని కూల్చివేసిన వార్తలు మీడియాలో రావడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడకు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళనకు దిగారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా వందలాది పోలీసులను మోహరించారు. పల్లా శ్రీనివాసరావును కూడా పోలీసులు అక్కడ నుంచి తరలించారు.
కొనసాగుతున్న అరెస్టులు, కూల్చివేతలు
cటీడీపీ నేతల అరెస్టులు ఒకవైపు, వారి భవనాల కూల్చి వేతలు మరోవైపు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంటే కోవిడ్ రోగులను గాలికి వదిలేసి, టీడీపీ నేతలను టార్గెట్ చేశారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. కరోనా చావులు, కరోనా రోగుల ఆర్తనాదాలు వినిపించకుండా మీడియాను డైవర్ట్ చేసేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టుగా ఉందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు.
Must Read : బాబు పిలుపు.. టీడీపీకి ఓటుతో జగన్ అరాచకానికి చరమ గీతం











