జగన్ తీరు మారలేదు. వైసీపీ విధానంలోనూ ఎలాంటి తేడాలేదు. తాజాగా గుంటూరు జిల్లా రెంటపాళ్లలో పర్యటించిన జగన్ ఎన్నికల టైంలో బెట్టింగ్ల కారణంగా నష్టపోయి గతేడాది సూసైడ్ చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ఓదార్చారు. ఐతే ఈ పర్యటన వివాదానికి దారి తీసింది. ఈ పర్యటనలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ప్రత్యర్థి పార్టీలను రెచ్చగొట్టేలా వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు.
జగన్ సైతం కార్యకర్తలకు ఏ మాత్రం తీసిపోలేదు. పోలీసులు ముందే హెచ్చరించినప్పటికీ…72 కిలోమీటర్ల దూరానికి 8 గంటల సమయం తీసుకున్నారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేసుకుంటూ బల ప్రదర్శన చేశారు.ఉద్దేశపూర్వంగా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలతో వైసీపీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిపైనా ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
రప్పా రప్పా నరుకుతం.. నా కొడకల్లారా.. అన్న వస్తాడు.. అంతు చూస్తాడు. గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా..రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని అంటూ ప్రదర్శించిన ప్లకార్డులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారం రాజకీయంగానూ దుమారం రేగింది. ఇదే విషయంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న లోకేష్..ట్విట్టర్ వేదికగా స్పందించారు.
లోకేష్ ఏమన్నారంటే –
గత ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టినా.. వైసీపీకి ఇంకా బుద్ధి రాలేదన్నారు నారా లోకేష్. ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసే ఇలాంటి చర్యలను ప్రజా ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదన్నారు. దీనిపై త్వరలోనే చర్యలు ఉంటాయని వైసీపీ సైకోబ్యాచ్కు హెచ్చరిస్తున్నట్టు పేర్కొన్నారు.











