దేశ ప్రధాని నరేంద్ర మోడీ నెమళ్లకు ఆహారం పెడుతూ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై ఎక్కువ మంది నెటిజన్స్ ట్రోల్ చేస్తూ నెగటివ్ కామెంట్ చేయడం గమనార్హం. ఇన్స్టాగ్రామ్ లో ఆయన పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రతిపక్షాలకు కూడా విమర్శలు చేసేందుకు ఆయుధాన్ని ఇచ్చినట్లయింది. ప్రధాని మార్నింగ్ వాక్ చేస్తున్న సమయం, ఆఫీస్ కు వెళ్తున్న సమయంలో నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి. ఈ వీడియోలో ప్రధాని విభిన్న దుస్తులలో కనబడటం విశేషం. సందర్భాన్ని బట్టి ఆయన వస్త్ర ధారణ ఉంది. సాధరణ ప్రజల మాదిరి ఆయన మాములు వస్త్రధారణలో ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రధాని పోస్ట్ చేసిన ఈ వీడియో ఆయన అభిమానులకు, బీజేపీ పార్టీ సానుభూతిపరులకు సంతోషాన్ని కలిగించింది.
ఇదే సమయంలో ఈ వీడియోపై ప్రతిపక్ష నాయకులే గాక మెజారిటీ నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. ‘జింక ప్రేమికులు నెమలి ప్రేమికులు..ప్రజా పీడకులు” అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా మరో నెటిజన్ ‘సచ్ఛేదిన్ ఆయేగా అంటే ఇదే ఆరేండ్లుగా ఇంతకన్నా డెవలప్మెంట్ ఏం కావాల? బాతులన్నీ నెమళ్లయిపూషన్లా?’ అంటూ కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ లలో రాజు అల్లు చేసిన కామెంట్ హైలైట్ గా నిలిచింది. జర్మనీ అధ్యక్షుడు అడాల్ఫ్ హిట్లర్ జింకలకు ఆహరం పెట్టె ఫోటోని పోస్ట్ చేసి మోడీ నెమళ్లకు ఆహరం పెట్టె వీడియోని సరిపోల్చాడు.

ఆ నెటిజన్ పవన్ కళ్యాణ్ కూడా ఫ్యాన్ అనుకుంటా! పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని పవన్ చెప్పిన ఫేమస్ డైలాగ్ ను ఆయన సందర్భానికి తగ్గట్లు వాడినట్లు అర్ధమవుతోంది. ‘సింహానికి గడ్డం ఉంటది.మనకు ఉండదు. మిగతాది అంతా సేమ్ టు సేమ్ రోయ్..అని పవన్ కళ్యాణ్ పాపులర్ డైలాగ్ గుర్తుకు వచ్చింది. నిరుద్యోగులు అందరికీ ఉపాధి కల్పిస్తాననీ, రైతులకు న్యాయం చేస్తాననీ, జర్మనీకి పూర్వ వైభవాన్ని తీసుకు వస్తాననీ హామీలు కుప్పించి 1933 లో జర్మనీ లో హిట్లర్ అధికారంలోకి వచ్చాడు. ఆ రోజు నుండి హిట్లర్ కారణ జన్ముడనే రీతిలో ప్రచారం హోరెత్తిపోయింది.అందులో భాగంగానే 1934 తీసిన ఈ ఫొటో.. లేడిపిల్లకు స్వహస్తాలతో ఆకలి తీరుస్తున్న హిట్లర్..జీవ కారుణ్యవాది, జంతు ప్రేమికుడు ఇలా రకరకాల శీర్షికలతో వార్తలు వండి వార్చారు.. ఆ తరువాతి చరిత్ర అందరికీ తెలిసినదే.. రాజకీయ ప్రత్యర్థుల వేట, అమానవీయ అణచివేత,జాత్యహంకార నరమేధం ..ప్రపంచ చరిత్రలో అది ఒక చీకటి కాలం. అవునూ 1934 లో సంగతి ఇప్పుడెందుకూ అనేగా మీ అనుమానం.. మీడియా లో ఏదో ప్రత్యేకమైన ఫోటో చక్కర్లు కొడుతుందటగా.. స్థల కాలాల్లో మార్పులే తప్ప..మిగతాది అంతా సేమ్ టు సేమ్ అని గుర్తు చెయ్యడానికే’ అంటూ ఆయన చేసిన పోస్ట్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.
https://www.facebook.com/raju.allu.5/posts/2938310876297293
కరోనా సమయంలో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ సమయంలో ఆహరం అందక వలసదారులు రోడ్లపై తమ ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆర్థిక ఉద్దీపన అంటూ శ్రీమాన్ మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన 21 లక్షల కోట్ల ప్యాకేజీ మసిపూసి మారేడు గాయ అనే సామెతను రుజువు చేస్తుంది తప్పా ప్రజలకు దమ్మిడి ఆదాయం లేదని నిపుణులు చెబుతున్నారు. కరోనా ప్రారంభ దశలో లాక్ డౌన్ ప్రకటించిన మోడీ కరోనా తీవ్రరూపం దాల్చిన సమయంలో మాత్రం అన్ లాక్ ప్రకియ ప్రారంబించి పరిస్థితులను అదుపు చేయడంలో విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పోస్ట్ చేసిన వీడియో చాలా మంది నెటిజన్స్ కు కోపాన్ని తెప్పించిందని నెగటివ్ కామెంట్లు చూస్తుంటే అర్ధమవుతోంది.











