తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేస్తున్నారు.ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను రాష్ట్రంలో ఏడాది పొడవునా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు.
మే 28న ఎన్టీఆర్ జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ వేడుకలను ఆయన కుమారుడు హిందుపపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంబభించనున్నారు.మొదట ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరులో శతజయంతి వేడుకలు ప్రారంభం అవనున్నాయి. అనంతరం గుంటూరు, తెనాలిలో జరిగే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు కూడా బాలయ్య హాజరవుతారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకల కోసం టిడిపి నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
టిడిపి ఆవిర్భావం నుంచి ఏటా మే నెల 27,28,29 తేదీల్లో మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.నిజానికి మే నెల వచ్చింది అంటేనే టిడిపి నాయకులు , కార్యకర్తలు పండుగ రోజులు వచ్చినట్లుగా భావిస్తారు. పార్టీ ఆవిర్భావం సంధర్భంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని పండుగ లాగానే జరుపుకుంటారు.ఈ నేపధ్యంలోనే పార్టీ అవతరించి 40 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపధ్యంలో ఈసారి ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులు నిర్ణయించాయి.ఈసారి మాత్రం మహానాడు కేవలం మే 28 ఒక్కరోజు మాత్రమే నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో, దానిని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ అన్న ఎన్టీఆర్ శత జయంతి నాడే మరింత ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది.











