గ్లామర్ డాల్ పూజా హెగ్డే సోమవారం హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తళుక్కుమంది. ఓ సినిమా షూటింగులో పాల్గొనేందుకు ఆమె ఈరోజు హైదరాబాద్ కు వచ్చింది. ఆమె పూర్తిగా ట్రావెల్ లుక్ లోనే కనిపించింది. చేతిలో బ్యాగ్, మొహానికి మాస్క్ ఉంది. బ్యాక్ టాప్, జాకెట్ ధరించింది. చేతిలో ఆరెంజ్ హ్యాండ్ బ్యాగ్, సన్ గ్లాసెస్ తో ఆకర్షణీయంగా కనిపించింది. స్టయిల్ విషయంలో ఏమాత్రమూ తగ్గలేదు. తెలుగులో ఇప్పుడు పూజా హవా సాగుతోంది. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ లో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది.
అలాగే అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లోనే నటిస్తోంది. గత ఏడాది సంక్రాంతికి ‘అల వైకుంఠపురము’లో లాంటి మంచి హిట్ ఆమెకు లభించడంతో ఆమెకు తిరుగులేకుండా పోయింది. కాకపోతే ఈ కరోనా సమయంలో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయంశమైంది. ముఖ్యంగా ఆమె దక్షిణాది సినీ పరిశ్రమపై ఈ వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె వివరణ ఇచ్చింది. దక్షిణాది వారికి నడుము చూపిస్తే వెర్రెక్కిపోతారు అంటూ ఆమె వ్యాఖ్యానించింది.
అంటే దక్షిణాది వాళ్లకు హీరోయిన్ల నడుము అంటే విపరీతమైన పిచ్చి అనేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి. అందుకే వాళ్లను మిడ్ డ్రెస్ లోనే చూడాలనుకుంటారు అంది. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, తనకు తెలుగు సినీ పరిశ్రమ అంటే ఎంతో గౌరవం అని పేర్కొంది. తనేమిటో తనను ప్రేమించే అభిమానులకు తెలుసని, తెలుగు చిత్ర పరిశ్రమకు రుణపడి ఉంటానని వివరణ ఇచ్చింది. ఈరోజు ప్రయాణంలో కూడా నడుము చూపిస్తే తన వ్యాఖ్యాలు గుర్తొస్తాయనో ఏమోగాని డ్రెస్సింగ్ విషయంలో ఆమె చాలా జాగ్రత్త పడినట్టు కనిపించింది.
Must Read ;- అఖిల్ మూవీ సెట్లోకి అడుగుపెట్టిన మెహబూబా బ్యూటీ.. !