ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జిల్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కధానాయిక కాగా .. గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈమధ్యనే ఇటలీలో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది చిత్ర బృందం. ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్ కోసం దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. దీనికోసం 30కోట్ల భారీ వ్యయంతో ఒక సెట్ ను కూడా నిర్మిస్తున్నారని సమాచారం.
ఆ సెట్ లోనే కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన మరో అప్డేట్ ఆసక్తిగా మారింది. ఇందులో మలయాళం సూపర్ స్టార్ జయరామ్ నటిస్తున్నారు. ఆ విషయాన్ని ట్విట్టర్ లో అఫీషియల్ ప్రకటించారు. అలాగే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు జయరామ్ కూడా ‘రాధేశ్యామ్’ టీంతో జాయిన్ అవుతుండడంతో సినిమాకు మరింత బలం చేకూరింది.
జయరామ్,.. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాలోనూ, అంతకు ముందు భాగమతిలోనూ కీలక పాత్రల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అందుకే ఆయన ప్రెజెన్స్ రాధేశ్యామ్ మూవీకి కూడా ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పుడు జయరామ్, ప్రభాస్ సెల్ఫీ సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో.. అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ‘రాధేశ్యామ్’ పోస్టర్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఇదొక అద్భుతమైన ప్రేమ కావ్యమని దర్శకుడు ముందుగానే రివీల్ చేశాడు. మరి రాధేశ్యామ్ లో జయరామ్ పాత్ర ఏమై ఉంటుందో తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.
Darling #Prabhas with versatile actor #Jayaram from the sets of #RadheShyam! @hegdepooja @UV_Creations @GopiKrishnaMvs @director_radhaa @RadheShyamFilm @bhagyashree123 pic.twitter.com/5Vi9xzAgN6
— BARaju (@baraju_SuperHit) November 27, 2020
Must Read ;- ప్రభాస్ ‘ఆదిపురుష్’ జనవరి నుంచి షూటింగ్