ఇంట గెలిచి .. రచ్చ గెలవాలి .. సినీ డైలాగ్స్ మానండి ..!
ఇంట గెలిచి .. రచ్చ గెలవాలి అన్న సూక్తిని రోజా అస్సలు ఫాలో అవ్వరు! అందుకే ఆమె స్థాయిని మరిచి మంత్రులు పెద్దిరెడ్డిని, నారాయణ స్వామిలను సైతం విమర్శిస్తుంటుంది. కానీ పార్టీలో పాతుకుపోయిన వ్యక్తులను పీకేసి, వారికి కనీసం ప్రయారిటీ ఇవ్వకుంటే .. వాళ్లేమైన తక్కువ తిన్నారు…! లాగి కోడితే పరువు పుత్తూరు నడి సెంటర్లో రోడ్డెక్కింది!! రోజా.. ఇప్పటికైన నీ మర్యాదను కాపాడుకోవాలంటే కలుపుకుపోతూ.. పార్టీని ముందుకు తీసుకుపొండి అంటూ సొంత పార్టీనేతలో రోడ్డెక్కి ప్రత్యక్షంగా విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పుత్తూరు ప్రధాన కూడళ్లల్లో రూ. 2.50 లక్షల ఖర్చుపెట్టి, 40 ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఉదయం కల్లా.. కట్టిన ఫ్లెక్సీలన్ని చిరిగిపోయాయి దర్శనమిచ్చాయి. దీంతో ఎమ్మెల్యే రోజా వర్గీయులే తమ ఫ్లెక్సీలను చింపేశారని, మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి ఫోటోలుండడాన్ని చూసి జీర్ణించుకోలేక చింపారని పుత్తూరు అంబేద్కర్ సర్కిల్లో మాజీ ఎంపీపీ ఏలుమలై ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఇలా సొంత నియోజకవర్గంలలో ద్వితీయ శ్రేణి నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్నారు. వాటి కంట్రోల్ చేయలేని ఆర్కే రోజా .. స్థాయిని మరిచి రాష్ట్ర రాజకీయాలను మాట్లాడటం, ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించడం సరికాదు .. ఇకనైనా సినీ డైలాగ్స్ మాని నియోజకవర్గం పై దృష్టిసారించండని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ గుప్పిస్తున్నారు.
ఎమ్మెల్యే రోజా వర్గీయులే ఫ్లెక్సీలు చింపారు ..!
దాదాపు రూ. 2.50 లక్షల విలువ చేసే ఫ్లెక్సీలను చింపేసింది రోజా వర్గీయులనని పుత్తూరు వైసీపీ నాయకులు ఆరోపించారు. రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న వారిని అరెస్ట్ చేసి, స్టేషన్ కు తరలించారు పోలీసులు. పుత్తూరు స్టేషన్ ఎదుట రోజా డౌన్ .. డైన్ .. అంటూ అధికారపార్టీలోని రోజా బాధితులు నినాదాలు చేశారు. దీంతో నిండ్ర, నగరి, వడమాలపేట కు చెందని ద్వితీయ శ్రేణులు నాయకులు చక్రపాణిరెడ్డి, కేజే కుమార్, మురళిరెడ్డి తదితరులు స్టేషన్ వద్దకు వెళ్లి .. కార్యకర్తలను విడిపించారు. ఫ్లెక్సీలను చింపిన వారిని వదిలేసి, తమను అరెస్ట్ చేయడం ఏమిటని పోలీసుల తీరును ఖండించారు. ఇదిలా ఉంటే.. సీఎం జగన్ పుట్టిరోజేమో కానీ, పుత్తూరు ఫ్లెక్సి వివాదం అధికారపార్టీలో కాకరేపుతోంది! గతంలో టీడీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు కూడా పుత్తూరు ఇటువంటి నీచ సంస్కృతి లేదని, సొంతపార్టీ నాయకులే రోజా చర్యలను ఎండ కట్టడం గమనార్హం