సోమవారం ఒకే రోజు ఇద్దరు రాజధాని రైతులు గుండెపోటుతో మరణించిన ఘటన మరవక ముందే మరో రైతు గుండె ఆగింది. రాజధాని గ్రామం తాళ్లాయపాలేనికి చెందిన కొండేపాటి పెద పకీరయ్య తన మూడెకరాల భూమిని అమరావతి రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. మూడు రాజధానుల ప్రకటనతో ఆయన మనోవేదనకు గురయ్యారు. అప్పటి నుంచి రాజధాని ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న పకీరయ్య మంగళవారం అర్థరాత్రి గుండెపోటుతో మరణించడం కలచివేస్తోంది. ఇప్పటికే అమరావతి రాజధానికి భూములిచ్చిన 123 మంది రైతులు గుండెపోటుతో మరణించారు. తాజాగా పకీరయ్య మరణంతో రాజధాని ఉద్యమకారు ఆవేదన చెందుతున్నారు.
Must Read ;- నేను రాజధానిగా పనికిరానా..! అమరావతి ఆక్రందన