అమరావతి రాజధాని ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. అనుకోకుండా పెద్ద కుదుపు వచ్చింది. ఒకే రోజు రాజధాని గ్రామాలకు చెందిన ఇద్దరు రైతులు గుండెపోటుతో చనిపోయారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన పాతూరి హైమావతి, అనంతవరానికి చెందిన వీర రాఘవులు ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. వీరు సంవత్సరకాలంగా అమరావతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. హైమావతికి ఉన్న ఎకరం భూమిని రాజధానికి ఇచ్చారు. అమరావతి నుంచి రాజధాని తరలిస్తున్నారనే వ్యధలో ఆమె గుండెపోటుతో చనిపోయారని కుటుంబసభ్యులు వెల్లడించారు. వీర రాఘవులు తనకున్న 60 సెంట్ల భూమిని రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. మూడు రాజధానుల ప్రకటనతో ఆయన ఆందోళనకు గురయ్యారు. సంవత్సరం నుంచి రాజధాని కోసం చేస్తున్న పోరాటాల్లో వీర రాఘవులు చురుగ్గా పాల్గొన్నారని గ్రామస్థులు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నతుగ్లక్ నిర్ణయంతో ఇప్పటికే 123 మంది రాజధాని రైతులు ప్రాణాలు కోల్పోయారని రైతులు ఆరోపించారు.
Must Read ;- నలుదిక్కుల ప్రతిధ్వనించనున్న రాజధాని జనభేరి!